8, ఫిబ్రవరి 2017, బుధవారం

RSS small History

ఇది RSS సంక్షిప్త చరిత్ర
●○●○●○●○●◎●○●○●○●
భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకోవడానికి నిర్మొహమాటంగా నిరాకరించిన వారు, ఈనాడు తమను తాము దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు.., అంతే కాకుండా వీళ్ళే ఎవరి దేశభక్తి ఎంతో నిర్ణయించే సర్టిఫికేట్లు ఇస్తున్నారు.. దీని వెనుక వీరి అంతర్యం ఏమిటి..??
RSS మూడవ సంఘ్ చాలక్ అయిన డియోరాస్ ఒక సందర్భంలో భగత్ సింగ్ వంటి ఉద్యమకారుల దారిలో నడిచే ప్రమాదం నుండి తనను RSS వ్యవస్థాపకుడు హెగ్డేవర్ ఎలా కాపాడాడో వివరించారు.. ఆరెస్సెస్ ఎవరితో విభేధిస్తుందో తెలియజేసేందుకు ఈ వాక్యం ఒక ఉదాహరణ మాత్రమే ..

అసలు ఎవరీ హెగ్డేవర్ - ఏమిటిి ఈ ఆరెస్సెస్
ఇతని పూర్తిపేరు కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్..

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ లచే స్థాపించిన "హిందుస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్"లో ముఖ్య కార్యకర్తగా ఉంటూ, బ్రిటీషు వారితో చేతులు కలిపి సంస్థ విషయాలలో గూఢచర్యం చేసేవాడు ఈ కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్..

1925 సంవత్సరం "కకోరీ రైలు దోపిడీ" విచారణలో బ్రిటీష్ వారికి రహస్యంగా సహకారం అందించి, రాం ప్రసాద్ బిస్మిల్ మరియు అశ్రఫుల్లా ఖాన్ వంటి దేశభక్తులకు మరణ శిక్షలు పడడానికి కారణం అయినాడు..

అది జరిగి రెండు నెలల తరువాత దేశభక్తి కలిగి దుందుడుకు స్వభావం కలిగిన యువతను, బ్రిటీష్ వ్యతిరేక/ స్వతంత్ర ఉద్యమాలు చేయకుండా మళ్ళించడానికి హెగ్డేవర్, బ్రిటీష్ వారి ప్రోద్బలంతో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" స్థాపించాడు..

ఇంగ్లాండు ప్రభుత్వానికి విథేయత ప్రకటించి, బ్రిటీష్ ప్రభుత్వంతో పరస్పర సహకారంతో మెలిగి., స్వతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసాడు..

హెగ్డేవర్ తరువాత సంఘ్ చాలక్ బాధ్యతలు తీసుకున్న మాదవ్ సదాశివ్ గోవల్కర్, ఇంకో అడుగు ముందుకు వేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఏమాత్రం దేశభక్తి కాదని., కేవలం మతం/సంస్కృతిని కాపాడుకోవడం మీదనే దృష్టి పెట్టాలని స్వయం సేవకులకు పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటం నుండి పూర్తిగా మళ్ళించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆరెస్సెస్ కార్యకర్తలను పాల్గొన వద్దని పిలుపునిచ్చాడు..
*1942 ఆగస్టులో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన తిరుగుబాటును అణిచేందుకు రాష్ట్రీయ స్వయం సేవకుల సహాయం మరువరానిది అంటూ బాంబే ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ కు ప్రశంస పత్రం అందించింది **

●ఆరెస్సెస్ - జాతీయ జెండా●
1930 జనవరి 26ని స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించి మూడురంగుల జాతియ జెండాను స్వీకరించినపుడు మొదటి సంవత్సరం మాత్రమే ఆ దినాన్ని పాటించిన హెగ్డేవర్ ఆరెస్సెస్, తరువాతి సంవత్సరం నుండి జాతీయ జెండాను పూర్తిగా వ్యతిరేకించినది..
22 జులై 1947 న త్రివర్ణ పతాకాన్ని కాన్స్టిటూయెంట్ అసెంబ్లీ ఆమోదించినపుడు కూడా ఆరెస్సెస్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది.. 14 ఆగస్టు 1947 ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ లో ఈ విధంగా రాయబడింది..
" అదృష్టం కలిసి వచ్చి స్వతంత్రం సాధించిన వీళ్ళు, ఇంక వేరేదేమీ లేనట్లు ఈ మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా ఆమోదించుకున్నారు.. ఆ జెండాను హిందువులు ఎప్పటికీ గౌరవించరు, మూడు అనేది చాలా అశుభదాయకమైన సంఖ్య, జాతీయ పతాకాంలో ఇలా మూడు రంగులు ఉండడం ప్రజల మానసిక స్థితి మీద తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది., దీని వల్ల దేశం భవిష్యత్తులో కష్టాలు పడుతుంది ""
ఇదీ ఆరెస్సెస్ కు జాతీయ జెండాపై ఉన్న అభిప్రాయం ., అందువల్లనే క్రిందటి సంవత్సరం "యోగా డే" సందర్భంగా మోడి జాతీయ జెండాను కావాలనే చెమట తుడుచుకునే తువ్వాలుగా వాడి అవమానించడం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి