21, జూన్ 2017, బుధవారం

✳ క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా? ✳

✳ క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా?  ✳

👉ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలి అంటే ఆచరించకూడదు అని చెప్పాలి.
👉మన ప్రధాని మోడీ తన హిందూ మతాన్ని అందరూ ఆచరించాలి అని చేయని వాిశ్వప్రయత్నం లేదు. ఒకప్పుడు R.S.S లీడర్ గా ఒక వెలుగు వెలుగు వెలిగిన ప్రధాని మోడీకి వున్న ఈ ఆసక్తి ఆశ్చర్యం కలిగించేది ఏమి కాదు.
.
👉 అయితే దేవుని జ్ఞానం లేని కొంతమంది క్రైస్తవులు కూడా ఈ యోగా ధినోత్సవమును ఆనందముగా జరుపుకున్నారు. ఇంకా బాధించదగిన విషయం ఏదనగా “ప్రభువుదినమైన” ఆదివారమును కొంతమంది సంఘకాపరులు వారి వారి సంఘాల్లో జరుపుకున్నారు (Church Service that Included Yoga).

సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
👉యోగా అంటే ఏమిటి?
👉 “యోగా అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది దీని అర్ధం “ఏకమవుట” లేక “కలిసిపోవుట”.
🔺యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం “ముక్తిని లేక రక్షణను పొందుట”.
🔹 యోగాలో అనేకమైన పద్ధతులు వున్నాయి.
🔸 “ధ్యానం” అన్నీ యోగా పద్ధతులకు మూలమై వున్నది.
👉 మరి ఈ ధ్యానం అనగా ఏంటో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి.
🔺 “ధ్యానం అనగా మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం”.
🔺 ఇలా మనుష్యుని ఆత్మను, బ్రహ్మ అనే దేవుని ఆత్మతో సంధి చేయటాన్ని మోక్షం (Moksha) అంటారు.

👉ఎంత అవివేకం క్రీస్తు యేసునందు దేవుడిచ్చే ఉచిత రక్షణను (ఎఫిసీయులకు 2: 8 – 9) మనుష్యులు వారి సాధనతో కొనుక్కోవాలి అనుకోవటమా?.
🔺క్రైస్తవుడిగా అది ఎన్నటికీ మనం చేయకూడదు. ఇప్పుడు అర్ధమైంది అనుకుంటున్నాను యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం ఏమిటో.

👉ఆరోగ్యకరమైన ఉపయోగాలు వుంటే యోగాను క్రైస్తవులు ఎందుకు చేయకూడదు:
🔺ఈ సందేహం చాలా మంది క్రైస్తవులలో కలుగుతుంది.
🔹మనం ప్రతి రోజూ చేసే వ్యాయామాల వలన మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.
🔸 ఆరోగ్యముగా ఉండుటకు ఇటువంటి వ్యాయామాలు చేయటంలో క్రైస్తవులకు ఎటువంటి తప్పు లేదు.
👉అయితే యోగా అభ్యాసము చాలా భిన్నమైనది.
🔺యోగాలో వ్యాయామము మాత్రమే లేదు,
🔺యోగా వ్యాయామముతో కూడిన ధ్యానము.
👉యోగా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏదనగా “మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం” ఇధి వ్యర్ధమైన ప్రయత్నం.

👉మన రక్షణకు యేసే మార్గం. ఈ రక్షణను వివిధ పద్ధతుల ద్వారా కొనుక్కోలేము.
యోహాను 14: 6:
“యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”.

అపోస్తులుల కార్యములు 4: 12“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను”.

యేసుక్రీస్తు నందు విశ్వాసంచేత దేవుడిచ్చిన కృపావరమే “రక్షణ” మరే విధముగా దానిని పొందలేము.
ఎఫిసీయులకు 2: 8 – 9:
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”.

👉మనం క్రైస్తవులము ఈ లోక సంభందులం కాదు అని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ లోకసంభందులు అనేక వ్యర్ధమైన క్రియలు చేస్తూ వుంటారు వాటన్నిటికీ మనం దూరముగా వుండాలి.
రోమియూలకు 12: 2:
“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”.

👉ఒక క్రైస్తవుడిగా దేవుని వాక్యమే మనము ధ్యానించాలి గాని , వ్యర్ధమైన నామములు కాదు. మరే నామము వలన రక్షణ కలుగదు గాని యేసయ్య నామమందు మాత్రమే రక్షణ కలుగును (అపోస్తులుల కార్యములు 4: 12)
కీర్తనలు 1:2:
“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు”.
ఆమేన్.

*🌴 పగటి రోజు🌴*

*🌴 పగటి రోజు🌴*

*♦13 గంటల 7 నిమిషాల పాటు పగలు*
గుడివాడలో తొలి సూర్యోదయం
నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.

®చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.

ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.

*♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ*
ఈ నెల 21వ తేదీ మనదేశంలోని *మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.*
ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో  సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

20, జూన్ 2017, మంగళవారం

💐 GOOD SERVANT 💐

✳ భళా, నమ్మకమైన మంచి దాసుడా. . . .✍

👉ఈ నమ్మకమైన వాడు....ఎవరు...?

( మత్తయి 25:21 ) " అతని యజమానుడు (వానితో ) భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. . . . " అని అనెను.
ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానవాక్యంలోని ఒక బాగము. . . .

ఒక్కసారి అలోచిదం bibleలో ఎంతమంది ఇలాంటి నమ్మకమైన మంచి దాసులు ఉన్నారు ?
చాలా మంది నమ్మకమైన మంచి దాసులు ఉన్నా అసలు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మనకి గుర్తుకు వచ్చే కొన్ని పేర్లు అబ్రాహాముగారు , అబ్రాహాము యింటి పెద్దదాసుడు అయిన ఎలియాజారుగారు , మోషేగారు, యెహొషువగారు, ఎలియాగారు, అపొస్తలుడైన పేతురుగారు, అపొస్తలుడైన పౌలుగారు, మీగిలిన అపొస్తలులు, మరియు దేవుని ఎదుట నమ్మకమైన మంచి దాసుడిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మనకి కనిపిస్తారు.
కానీ. . . .

👉మనం చుసినా చూడనట్లు, చదివినా చదవనట్లు ఉండే ఒక నమ్మకమైన మంచి దాసుడు మనకి bibleలో ఉన్నాడు.

➡ అతనెవరో గుర్తొచ్చిందా ?
అతను ఎవరో కాదు ; అతనే " హిత్తీయుడగు ఊరియా "

* మూలవాక్యం ( సమూయేలు రెండవ గ్రంథము 11 : 1-27 ) మరియు ( సమూయేలు రెండవ గ్రంథము 12 : 1-15 ).

👉అది వసంతకాలము అని ఆ కాలమున రాజులు ఎక్కువగా యుద్ధమునకు బయలుదేరువారని వ్రాయబడి ఉన్నది,
🔺కానీ దావీదు మాత్రం తన మందిరంలోనే ఉన్నాడు,
🔺తన రాజ్జ్యం యొక్క రక్షణ విషయంలో దావీదు క్రమంతప్పాడు,
🔺అలాగే దావీదు ఎప్పుడు లేచాడు ? ప్రొద్దుగ్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచాడు.
🔺తన జీవన విధానంలో కూడ దావీదు క్రమంతప్పాడు,

👉ఎప్పుడేతే మనం క్రమం తప్పుతామో అప్పుడే మనం పాపంలోకి నేట్టబడుతము.
🔺 దావీదు కుడా పాపమునకు లోనయ్యాడు....ఆ యువతీ....ఆ బత్షెబ హిత్తీయుడగు ఊరియాకు భార్య అని తెలిసినా ఆ బత్షెబతో పాపం చేసాడు. తరువాత ఆ స్త్రీ గర్భవతి అయిన విషయం దావీదుకు తెలియగా, తన మీద పడనున్న నిందని గమనించిన దావీదు ఒక ఆలోచన చేసాడు. . . .
🔹అది. . . .దావీదు, ఊరియాను నాయొద్దకు పంపుమని ఆజ్ఞ ఇచ్చెను.
ఊరియా దావీదునొద్దకురాగా దావీదు ఊరియా యొక్క యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను.
🔹తరువాత దావీదు ఊరియాతో నీవు ఇంటికిపోయి శ్రమతీర్చుకొనుమని సెలవిచ్చెను.

🔺కానీ ఊరియా తన యింటికి వెళ్లక దావీదుకి ఉన్న ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొనెను.
ఈ విషయం దావీదుకి తెలియగా, దావీదు మరలా ఊరియాను భోజనమునకు పిలిచి; అతడు బాగా తిని,త్రాగిన తరువాత దావీదు అతని బాగా మత్తునిగా చేసి ఇంటికి పంపెను;
🔺కానీ ఆ సాయంత్రము కూడా ఊరియా బయటకి వెళ్లి తన యింటికి పోక దావీదుకి ఉన్న ఇతర సేవకుల మధ్య పడక మీద పండుకొనెను.
ఈ రెండవ రోజు కూడా ఊరియా తన ఇంటికి పోలేదని దావీదుకి తెలిసింది.

👉అసలు దావీదు ఆలోచన ఏమిటి. . . ?
బత్షెబ గర్భవతి; అ నింద తన మీదకి రాకుండా ఉండుటకు ఆ సమయంలో యుద్ధంలో ఉన్న ఊరియాను పిలిచి తన ఇంటికి పంపితే అతను పోయి తన బార్యతో కుడితే బత్షెబ గర్భవతి అగుటకు ఊరియానే కారణం అనుటకు అవకాశం ఉంది, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు అని దావీదు ఆలోచన అందుకే పనిమాలా ఊరియాను పిలిపించి ఇంటికి పంపాడు శ్రమ తీర్చుకొనుమని సెలవిచ్చెను.

అయిన ఊరియా ఇంటికి పోలేదు, చెబితే పోలేదు కనుక ఈసారి దావీదు అతని మత్తునిగా చేసి ఇంటికి పంపెను తాగిన మత్తులో ఇంటికి పోయి బార్యతో కూడతాడు అని కానీ ఊరియా ఇంటికి పోలేదు.
🔺దావీదు నీవు యింటికి వెళ్లక పోతివేమని అడిగినప్పుడు ఇవి ఏవి తెలియని ఊరియా ఏమి చెప్పాడో తెలుసా ?

👉అప్పుడు ఊరియా "దేవుని మందసమును ఇశ్రాయేలువారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులోనుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా ?"
ఓ రాజా....నీ తోడు, నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని....దావీదుతో అనెను.

చూసారా....ఊరియాయొక్క రాజభక్తి, తన రాజు ఇంటికి పోయి ఆనందించు అనినను ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొన్నాడు, తరువాత దావీదు అతని మత్తునిగా చేసి ఇంటికి పంపినను ఆ మత్తులో ఊరియా ఇంటికి పోలేదు, పోయి అనందించలేదు ఆ రోజు కూడా ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొన్నాడు,
తన తోటి సేవకులు బయట దండులో యుద్ధంలోనుండగా, నేను భోజన పానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా ? అంటాడు ఊరియా. . . .
👉అదే ఊరియాయొక్క రాజభక్తి.

ఊరియా ఏంత నమ్మకమైనవాడో మనకి చూపే మరో విషయం ఈ వాక్యంలోనే మనకి కనిపిస్తుంది. . . .
అది. . . .( సమూయేలు రెండవ గ్రంథము 11 : 14-15 )
". . . .దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని; యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. "

ఏంత ప్రయత్నం చేసిన ఊరియా తన ఇంటికి పోకపోవడంతో దావీదు తన చివరి నిర్ణయం తీసుకున్నాడు అది ఊరియాని చంపించాలి అని.
🔺మీరు గమనించారా ?
ఇందులో ఊరియా ఏంత నమ్మకమైనవాడో మనకి చూపే విషయం ఏముంది ?
( సమూయేలు రెండవ గ్రంథము 11 : 15 ) " యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. "

ఊరియా యుద్ధంలో చనిపోయేలా చేయమని దావీదు యోవాబునకు ఒక ఉత్తరము వ్రాయించి అది మరలా ఊరియాచేత యోవాబునకు పంపించెను.
👉దావీదు తనతో పంపుతున్నది ఏమిటో చూదం అని ఒక్క సారి ఆ ఉత్తరము చూస్తే తెలిసేది తాను తీసుకుపోతుంది తన మరణశాసనం అని, అది చూసుంటే ఊరియా చావునుండి బయటపడేవాడు. . . .కాదంటారా ?
🔺కానీ ఊరియా ఆ ఉత్తరము ఏమిటో....అని చూడలేదు,
🔺చుడాలని కుడా అనుకోలేదు,
🔺తన రాజుకి నమ్మకంగా పనిచేసాడు.

➡ భళా, నమ్మకమైన మంచి దాసుడా. . . . అని పిలిపిచుకోనుటకు ఊరియా అర్హుడు.

"దావీదు నిజంగా గొప్ప విశ్వాస వీరుడు" "కాదు" అని మనం ఎంతమాత్రమూ అనలేము,

👉కానీ దావీదు చేసిన ఈ కార్యం దేవునికి దుష్కార్యముగా అనిపించింది అని దేవుని వాక్యం చెబుతుంది.
( 2 సమూయేలు 11 : 27 )
". . . .అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. "

(2 సమూయేలు 11 : 1-27) మరియు (2 సమూయేలు 12 : 1-15) లో
👉మనకి ఒక గొప్ప విశ్వాస వీరుడి (దావీదు) పతనం,
👉అదే సమయంలో
ఒక నమ్మకమైన మంచి దాసుడు (హిత్తీయుడగు ఊరియా) ని చూడగలం. . . .

" భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. . . ."

హల్లెలూయ. . . .

---------------------------------------------------------

17, జూన్ 2017, శనివారం

Daily work

🔴Daily 1 Apple,
     No Doctor

🔴Daily 5 Badam,
    No Cancer

🔴 Daily 1 Lemon,
     No Fat

🔴 Daily 1 glass Milk,
     No Bone Problm

🔴Daily 12 glass Pani,
     No skin problm

🔴Daily 4 dates,
     No weakness.

🔴 Daily 3 times pray,
     No Tensions

🔴Daily  8 hrs sleep
Happy ooo happy 😊

Dont stop 4wd plz

* ప్రభు బల్ల*

✳ ప్రభు బల్ల ✳

👉1. ప్రభు బల్ల అంటే ఏంటి?
👉2.ఎందుకు తీసుకోవాలి?
👉3. దేనికోసం తీసుకోకూడదు?
అనే ఈ మూడు అంశాలు ధ్యానిద్దాము.
మనకు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది శనివారం తీసుకుంటారు. కొంతమంది మొదటి ఆదివారము & చివరి ఆదివారము తీసుకుంటారు.

1⃣. ప్రభు బల్ల అంటే ఏమిటి?

యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను - పస్కాపశువును వధించి, హిస్సోపు కుంచె తీసుకొని, రక్తములో ముంచి, ద్వార బంధపు పైకమ్మికిని, రెండు నిలువ కమ్మిలకు ఆ రక్తము రాయవలెను. ఐగుప్తీయులను సంహరించుటకు వచ్చినపుడు ఈ రక్తము చూసి సంహరకుడు లోపలికి రాడు. దీనిని కట్టడగా ఆచరించవలెను (నిర్గమ 12:21-25). పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా, యేసు పేతురును, యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను (లూకా 22:7-8).
ఆ రోజు దేవుడు పస్కా బలికి సాదృశ్యముగా, బలి పశువుకి సరూప్యముగా రొట్టెను, బలి పశువు రక్తానికి సరూప్యముగా ద్రాక్షరసాన్ని ఇచ్చెను (లూకా 22:17-20). ఇకనుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగా, ద్రాక్షరసాన్ని యేసు రక్తానికి సారూప్యముముగా మనము తీసుకుంటున్నాము. ఈ ప్రక్రియనే ప్రభుబల్ల అంటాము.

2⃣ .ఎందుకు ప్రభుబల్ల తీసుకోవాలి?

🔆 మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట,

🔆 క్రీస్తు_రక్తములోనిది త్రాగుటయే గదా? (1కోరింథి10:16).
ప్రభుబల్లలో పాలు పొందునపుడు
అయన
బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము.
(1కోరింథి 11:24)
🔆ఈ కార్యము ఆది సంఘం దినదినము,
ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)

🔆 దీనిని ప్రభువువచ్చు వరకు ఆచరించెదము.
(1కోరింథి 11:26)
🔆 అయన మరణము ప్రచురించు చున్నాము.
(1కోరింథి 10:16-17)

🔆 దీనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1కోరింథి11:28)

3⃣. ప్రభుబల్ల దేనికోసం తీసుకోకూడదు?

🔆 పాపాలు క్షమింపబడుటకు కాదు.
పాపాలు కేవలం మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందితేనే పాపాలు క్షమింపబడతాయి.

🔆 శరీర ఆరోగ్యంకోసం కాదు.
ప్రభుబల్ల వలన శరీర ఆరోగ్యము రాదు, నిత్య జీవము కలుగును. (యోహాను 6:53-59)
ఇది దేవుని శరీరం రక్తం అని కాకుండా అయోగ్యముగా స్వీకరిస్తే బలహీనులము రోగులము అవుతాము (1కోరింథి 11:30)

తెలియక
🔺కొందరు రక్షణ,
🔺 ఆశీర్వాదము,
🔺రోగ విముక్తి కొరకు,
🔺 సమస్యల పరిష్కారము కొరకు,
🔺ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు. అలా కాకుండా
👉నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము.

🔆 అయోగ్యులముగా కాక ప్రభుబల్లకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని, యోగ్యులగా ప్రభుబల్ల_సమీపిద్దాము. అప్పుడే నిత్యజీవ పాత్రులము అవుతాము. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక! ఆమేన్.ఆమేన్.ఆమేన్.

-------------------------------------------------------

15, జూన్ 2017, గురువారం

RRK murthy testimony in TELUGU

*ఆచార్య ఆరార్కే మూర్తి గారి సాక్ష్యం*

   మా ఊరు గోవిందాపురం, గుంటూరు జిల్లా, నరసారావు పేట తాలుకా; పుట్టి పెరిగింది సాంప్రదాయకమైన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబము. మా నాన్న గారి పేరు రంగనాయక శర్మ, మా తల్లి గారి పేరు కామేశ్వరమ్మ, మేము ఆరుగురు అన్నదమ్ములం , అందరిలో నేను …చిన్నవాడిని .
పూర్తి పేరు రాయసం రాధాకృష్ణ మూర్తి, హరితస గోత్రం, పూర్వీకులు వైశ్య దేవం, అగ్నిహోత్ర పూజ చేసేవారు, ఇలావేల్పులు వీరభద్రుడు, భద్రకాళి.

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాము , మధ్య తరగతి కుటుంబము, ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. మా నాన్న గారికి కోటప్ప కొండ ధర్మ కర్తృత్వం ఉండేది. కవుల కుటుంబము, మా పూర్వికులు రాజుల ఆస్థానాలలో కవులు, లేఖికులు.
నా బాల్యం అంతా గోవింధాపురంలోనే గడిచిపోయింది. పూజ పునఃస్కారాలు ఎక్కువగా చేస్తుండేవాడిని , ఆంజనేయుడు, శివుడు, వీరభద్రుడు, జనార్ధనుడు గ్రామ దేవతలు.
మా అమ్మ గారికి చదవను రాయను రాదు, నాన్న గారి ద్వారా ఆమెకు శ్రుత పాండిత్యము అబ్బింది. ఆమె ఆచారము, మడి, దేవతార్చన, జపతపాలు, ఏకాదశి ఉపవాసాలు, ప్రతి ఏట పెట్టె అబ్దికాలు, తద్దినాలు, వీటితో సతమత మైపోతూ ఉండేది.
మా నాన్న గారు సంస్కృత పండితుడు, ధ్యాన శ్లోకాలు, భగవద్గీత, భాష్యాలు వల్లిస్తూ ఉండేవారు.
అతి కష్టం మీద నరసారావు పేట లో హై స్కూల్ చదువు ముగించుకుని , గుంటూరు లో ఆంధ్ర కళాశాలకు పై చదువులకు వెళ్ళాను , ఆరోగ్యం బావుండక రెండు సం.లు చదువుకు అంతరాయం కలిగింది.
చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ , తెలుగు భాషలలో అభిరుచి ఎక్కువ. తెలుగులో కవిత్వం రాసేవాడిని , ఏవేవో పద్యాలు పాటలు రాసి, తోటి విద్యార్థులకు వినిపించేవాడిని , తరగతిలో ఉత్తమ విద్యార్ధి అనే పేరుంది. బాగా అల్లరి చేసేవాడిని .
రాజకీయాలలో కూడ తలదూర్చి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్నేహితులతో కలసి వాల్ పోస్టర్లు అంటించాను .
చిన్నప్పటి నుండి బైబిలు అన్నా, క్రైస్తవులు అన్నా చాల తేలిక అబిప్రాయం ఉండేది, ఇది విదేశీ మతం, మతం లేని వారికి ఇదొకటి దొరికింది, ఇదొక హాస్యాస్పదమయిన మతమని హేలనచేసే వాడిని . గ్రామ బోధకులకు అడ్డ దిడ్డమైన ప్రశ్నలు వేసి సతాయించేవాడిని . చిన్నప్పటి నుండి వీరు ఊరి బయటే ఉండేవారు, వీరు తప్ప ఈ మతాన్ని ఇంకెవరు చేపట్టరని వ్యాఖ్యానించే వారు. మత గ్రంధాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో బైబిలు చౌకబారయినది, అది చదవాల్సిన అవసరమే లేదనుకున్నాను . ఇలాంటి మనో భావాలతో పెరిగాను . చిన్నప్పటి నుండి అతి దేవతా భక్తిలో పెరిగాను , శంకరాచార్యుని స్తోత్ర శ్లోకాలు కంటత వచ్చు.
గోవిందపురంలో నంబి కుటుంబం ఉండేది. ఎక్కువగా వారి ఇంట్లోనే ఉండేవాడిని , రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్నాలు ఉద్యోగం చేశాను .అదీ వదిలేశాను , ఎక్కడ నిలకడ లేదు, మానసికంగా అసంతృప్తి, ఆత్మ శాంతి లేదు, శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంధాలు ఎన్నో చదివాను
నేను నరసారావు పేట హై స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు నతానియేలు అనే క్రైస్తవుల అబ్బాయి తో స్నేహం అయింది. అతనికి కవిత్వం పిచ్చి ఎక్కువ, యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు, ప్రభోధాలను పద్యాల్లో రాసి తెచ్చేవాడు, నేను సరి చేసే వాడిని, నాకు నతానియేలు మంచి స్నేహితుడు కాని అతని మతం – నాకు అసహ్యం. అయినా అతని ఎదుట నేను విమర్శించేవాడిని కాదు.
నేను ఇంటర్ చదువుతూ మానేసి, ఆరోగ్య కారణాలను బట్టి కాకినాడలో మా అన్నయ్య దగ్గరకు వెళ్లాను, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవాడు. మా పెద్దక్కయ్య బాల్య వితంతువు మా అన్నయ్య దగ్గరే ఉండేది. నేనూ అక్కడే ఉంటుండగా నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. సూత్రాల శేషగిరి రావు గారని ఒకాయన మా ఇంటికి వచ్చాడు, ఆయన మధ్వ బ్రాహ్మణుడు. విదేశీయులకు తెలుగు భాష నేర్పుతాడు. పాశ్చాత్య మిషనరీ ల మధ్య ఆయనకు మంచి పేరుంది. గొప్ప ఉపాధ్యాయుడు.
మాటల సందర్బములో శేషగిరి రావు నా విషయం ప్రస్తావించాడు, తనకు అసిస్టెంట్ గా మిషనరీలకు తెలుగు నేర్పేందుకు నన్ను పెట్టుకుంటానన్నాడు. నేను సరే అన్నాను. మా అన్నయ్య ఒప్పుకున్నాడు, తెల్ల దొరలకు తెలుగు నేర్పుతూ నేను కాకినాడ, రామచంద్రాపురం, ఊటి, కొడైకెనాల్, ప్రాంతాలన్నీ తిరిగాను, వారికి తెలుగు నేర్పడం నా పని. వ్యాకరణం నేర్పాలి, తెలుగులో వారితో సంభాషణ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త నాకివ్వబడిన పుస్తకము.
ఆ పుస్తకము చదవడము అంతగా నాకు ఇష్టము లేకపోయినప్పటికీ ఉద్యోగము నిమిత్తము చదివాను, అందులోని భాష విలక్షణం గా ఉన్నట్లు మొదట తోచినది. ఇంగ్లిష్ లో యోహాను సువార్త చదివి దానిని తెలుగులో సరిపోల్చుకున్నాను, ప్రతి వచనము చదివి, భాషా పరంగా ప్రతి వచనము విడదీసి, వ్యాకరణము నేర్పుతూ ఉంటే, దొరలూ ఆశ్చర్య పోయేవారు. ఒక దొరనాతో అన్నాడు, యువకుడివి మంచి అనుభవము ఉన్న ఉపాద్యాయుడిలాగ యోహాను సువార్త లోని పాటాలు మాకు నేర్పుతున్నావు. అభివృద్ది లోకి వస్తావు, అన్నాడు, మరో దొర, నేను ఏకాంతంగా ఉన్నప్పుడు, ” నీవు చదివి చెబుతున్నావే, ఈ యోహాను సువార్తనే గనుక నీవు నమ్మితే, తెలుగు దేశంలో పెద్ద బోధకుడివి అవుతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు” అని అన్నాడు.
కొందరు దొరలు నిన్ను సెమినరీ కి పంపిస్తాము వెళ్తావా అని అడిగారు, నేను నవ్వి చివరికి నేను క్రైస్తవ బోధకుడినా అయ్యేది అని అన్నాను. అయితే దేవుని సంకల్పంలో నేను బోధకుడినే. మరో దొర ప్రవచనము చెప్పాడు కూడ. ఒకానొక రోజు న సువార్తను చెప్పే గొప్ప ప్రసంగీకుడివి అవుతావు. నిజం ఆ ప్రవచనమే నెరవేరింది.

యోహాను సువార్త ఎన్నో వందల సార్లు చదివాను, మిషనరీల చేత చదివించాను, అందులో ఏ అధ్యాయములో ఏముందో నాకు తెలుసు. కాని యేసు క్రీస్తు నా రక్షకుడు కాడు, ప్రభువు కాడు. క్రైస్తవ్యం నాకు అక్కర లేదు, క్రీస్తుకు నేను వ్యతిరేకి నేమి కాను, అనే వేదాంతం కల్పించుకున్నాను. క్రీస్తును నా హృదయంలోకి రానివ్వకుండా నా ఊహలను సమర్దించుకోడానికి ఎన్నెన్నో తార్కిక వాదనలను తయారు చేసుకున్నాను, యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు కాడు, ఏ దేవుడిని నమ్మిన ఒక్కటే, దేవుళ్ళ మధ్య పోటి ఏమిటి?
ఏ దేవుడు గొప్ప వాడు అని మనకెందుకీ వాదం? అందరూ ఒక్కటే అనుకుంటే సరిపోతుందిలే అనుకున్నాను, మతాల మార్పిడి తప్పు, అని మిషనరీ లతో వాదించాను, దేవుని అవతారాలు ఎన్నెన్నో, యేసు క్రీస్తు ఒక అవతారం అనేంత వరకు వచ్చాను. మిషనరీలు నన్నెంతో ప్రేమించేవారు, నేను ఎంత విమర్శించిన ఏమి అనే వారు కారు.
వారి దగ్గర ఉన్న పుస్తకాలెన్నో చదివాను,  తద్వారా జ్ఞానం వృద్ది అవుతుంది అనుకున్నాను. యేసుని అంగీకరించి క్రైస్తవుడనవుతానని నేను కలలో కూడ ఊహించలేదు. కాని దేవుని సంకల్పము నా పట్ల వేరే విధముగా ఉన్నది. మిషనరీలు వేల కొలది మైళ్ళు వచ్చి భాష నేర్చుకుని ఇక్కడి ప్రజలకు ఏసుక్రీస్తు సువార్త బోదిస్తున్నారే, వీరి దీక్ష ప్రసంశనీయం అనుకున్నాను. అప్పుడప్పుడు నాకనిపించేది , ఎందుకని వీరు ఊరి బయట నిమ్న జాతుల మధ్యే ఉండిపోతారు. అది నాకు అర్థం కాలేదు. యేసు అందరికి ప్రభువంటూ నిమ్న కులస్తుల మధ్యే ఉండి, పని చేస్తారేమిటి? అని అడగాలనిపించేది కాని ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు.
నాలో అనిర్వచనీయమైన సంఘటన నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు మొదలయింది. యచ్ జి క్రాన్ అనే మిషినరి తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన నేను ప్రతి రోజు గంటల తరబడి ఆద్యాత్మిక విషయాలు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో నా సంభాషణ నాకు గొప్ప ఆశీర్వాదకరంగా పరిణమించింది. జటిలమైన థియాలజి సత్యాలు కరతలామలకం అయ్యాయి.
ఈ సంధర్బములో నేనో మాట చెప్పాలి, *బైబిలు లో తప్పులు పట్టుకుందామని చదివాను, బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకుంది*.
బైబిలు మామూలు పుస్తకమయితేగా అది దైవావేషం వలన కలిగిన లేఖనము, దేవుని ముఖ నిర్ఘతమయిన మాట జీవప్రధం. ఆద్యాత్మిక శస్త్ర చికిత్స సాధనం.
మిషనరీలకెందరికో తెలుగు నేర్పాను, వారిని తెలుగు పరీక్షలకు సిద్దపరిచాను, వారికి సంభాషణ, వ్యాకరణం నేర్పాను, యోహాను సువార్త లోని సారాంశమంత వారికి నేర్పి, వారి చేత మాట్లాడించాను. మిషను కాంపౌండ్ లోనే కాపురమున్నాము.
ఆ కాంపౌండ్ లో ఒక మిషనరీ అతని చుట్టూరా కొన్ని క్రైస్తవ కుటుంబాలు, ఒక బడి, ఒక గుడి, ఆసుపత్రి, మిషనరీ చుట్టూ ఉపగ్రహాలు కొన్ని తిరుగుతూ ఉంటాయి. మిషను కాంపౌండ్ రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టవు. మిషనరీ ఆసరా చూసుకుని కొందరు అధికారం చెలాయించడం,ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, ఇదంతా చూస్తుంటే నాకు అంత అయోమయం గా అనిపించింది. అయినా క్రైస్తవ సందేశం నా హృదయాన్ని ఆకట్టుకుంది. క్రైస్తవులను సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
పరాయి దేశం నుంచి వచ్చిన మిషనరీ ఊరికి దూరంగా ఒక బంగ్లా కట్టుకుంటాడు, అతడికి పనివారు కావాలి, వంట పని తోట పని చేయడానికి కొన్ని కుంటుంబాలు కాంపౌండ్ లో నివాసమేర్పరచుకుని ఉంటాయి. తరువాత మిషన్ సంస్తలో పని చేసే ఉపాద్యాయులు, నర్సులు, డాక్టర్లు, అదే కాంపౌండ్ లో కాపురముంటారు. నేను వారి మద్య కాపురమున్నాను.

*వాక్య పటన*:
నారాయణపేటలో కొన్నాళ్ళు కుటుంబముతో ఉన్నాను, దేవుని వాక్యమనే బైబిలును సునిశితము గా పటించాను. ఆలోచిస్తూ ఉన్నాను, ఎన్నో వ్యాఖ్యానాలు చూశాను, బైబిలు సత్యం నన్ను ముద్దాయి గా నిలబెట్టింది. బైబిలు మామూలు పుస్తకము కాదని, అందులో శక్తి భరితమయిన సత్యం ఉన్నదని గ్రహించడానికి కొన్ని సం.ల కాలం పట్టింది. నారాయణ పేటలో క్రాన్ అనే మిషనరికి తెలుగు నేర్పుతున్నాను, ఆ వూరు ఆర్య సమాజ కేంద్రం. అక్కడ ఉంటూ ఉండగా నాలో అనిర్వచనీయమైన పరివర్తన అంచెల వారిగా వచ్చింది.
క్రైస్తవుల బలహీనతలను విమర్శించే నాలో వారి పట్ల ప్రేమ సానుభూతి కలగ సాగాయి. గ్రామీణ బోధకులతో గంటల తరబడి గడిపేవాడిని. వారు చెప్పేదంతా ఓపికగా వినేవాడిని. వారికి నాకు ఘాడ స్నేహం ఏర్పడింది. వారి అమాయకతను క్రీస్తు నందలి ప్రేమను గుర్తించాను. నైతికంగా బలహీనులే అయినా క్రీస్తు నీతిని నమ్ముకున్న ఈ ప్రజలపై నాకు ఆదరాభిమానాలు కలగ జొచ్చాయి.

*సాతాను చర్యలు*
రెండు మూడు సార్లు సాతాను క్రీస్తు పట్ల లేని పోనీ అపోహలు పుట్టించాడు, నేను వెళ్లి పోయేటట్లు చేశాడు, అయినా మళ్ళి వచ్చేశాను, నా అంతరాంతరాలలో తీవ్ర సంఘర్షణ మొదలయింది. యేసు ప్రభువులోని అయస్కాంతపు ఆకర్షణ ఒక చెంప, నా బందుమిత్రాదులపై మమకారం ఒక చెంప. ఈ విధం గా నాలో ద్వంద్వ యుద్ధం మొదలయింది. యేసు క్రీస్తు నన్ను పూర్తిగా కోరుతున్నాడు. నేనాయనకు సంపూర్ణముగా వశమయిపోతే నా బంధువులకు దూరమయి పోతాను, ఆటా, ఇటా, ఎటూ తోచని పరిస్తితి ఏర్పడింది. ఒక రోజు ఊరి బయటికి వ్యాహాల్లి గా ఓ గట్టు పైకి వెళ్లాను, ఎంతో సేపు అక్కడే కూర్చుడి పోయాను. తీవ్రంగా తలపోశాను, క్రీస్తును అంగీకరిస్తే వచ్చే నష్టాలు, నిరాకరిస్తే వచ్చే కష్టాలు అంచనా వేసుకున్నాను.

*బేరీజు*
బందువులు బలగము నన్ను హేళన చేస్తారు. నిమ్న జాతులలో కలిసి పోయానని ఆడిపోసుకుంటారు. వారితో కలిసి పోతే తప్పేమిటి?. రాజకీయాలలో నయితే ఇలాంటి వాటికి మంచి పేరు వస్తుంది. కాని క్రీస్టు విషయములో ఇది ఒక నిందగా పరిణమిస్తుంది. ఎందఱో రాజకీయ నాయకులు నిమ్న జాతులలో తిరిగి గొప్ప నాయకులయ్యారు, కాని క్రీస్తు కోసం ఇది నాకు మోయవలసిన శిలువ అయింది. అయితే మటుకేం క్రీస్తు కోసం నిమ్న జాతి వాణ్ణే అవుతాను. అందరు నన్ను అలాగే విమర్శించనియ్యి. అదే నాకు ఆత్మా నందం , ఆత్మ శాంతి.
తర్వాత యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాను
*-RRK MURTHY*