1, జూన్ 2017, గురువారం

BIBLE WONDERS

✳ సాధారణమైన మనుష్యులు, అసాధారణమైన విజయాలు ✳

👉“Bible”
అనటానికి చిన్న పదం....
👉చూడటానికి చిన్న పుస్తకం;
👉కానీ ఉహించలేని శక్తికి నిదర్శనం ఈ Bible.
👉ఆరువేల సం!!రాలకు పైగా చరిత్ర, నలబైమందికి పైగా రచితలు ఆత్మ ప్రేరణతో ఇచ్చిన సాక్షం ఈ Bible.
👉కొందరు దేవుడు మనిషికి వ్రాసిన ప్రేమలేఖ ఈ Bible అంటారు,
👉దేవుడు మనిషి కలిసి వ్రాసుకున్న డైరీ అంటారు.
👉కొందరు లోకంలో ఎలా బ్రతకాలో నేర్పే పాటలు ఈ Bible అంటారు,
👉పరలోకం వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఈ Bible అంటారు. . . .
👌ఈ మాటలన్నీ నిజాలే. Bible చదివిన వారికీ ఇది బాగా అర్ధం అవుతునది.

➡ ఒక్క యోబు గ్రంధాన్ని ప్రత్యేకిస్తే Bible అంతా ఒక వరుస క్రమంలో వ్రాయబడి, కుర్చబడింది.
🔅ఆదికాండము. . . . దేవుని ప్రజలు వృద్ధిచెందటం ప్రారంభించారు.
🔅నిర్గమకాండము. . . . దేవుని ప్రజలు విమోచింపబడ్డారు.
🔅లేవీయాకాండము. . . . దేవుని ప్రజలు ఆరాధించటం నేర్చుకున్నారు.
🔅సంఖ్యాకాండము. . . . దేవుని ప్రజలు తమతమ గోత్రస్వాస్యములను స్థిరపరచుకున్నారు.
🔅ద్వితీయోపదేశకాండము. . . . దేవుని ప్రజలు దేవుని నిబంధనలను మరోమారు ధ్యానించుకున్నారు.
🔅యెహోషువ గ్రంధం. . . . దేవుని ప్రజలు వాగ్ధాన దేశానికి చేర్చబడ్డారు.
ఇక్కడి వరకు దేవుని ప్రజలకు అంతా బాగానే ఉంది.... కానీ ఇక్కడ నుండి వారు విభిన్నమైన ప్రయాణమై చేయవలసి వచ్చింది.
న్యాయాధిపతుల గ్రంధం దేవుని ప్రజల జీవితాలలోనే భయంకరమైన మలుపులను వ్రాసి ఉంచిది.
ఈ విషయం మనకి బాగా అర్ధం అవ్వాలంటే యెహోషువ గ్రంధం, న్యాయాధిపతుల గ్రంధం ప్రక్కప్రక్కనే ఉంచి చూస్తే తెలుస్తుంది.
👍యెహోషువ గ్రంధంలో దేవుని ప్రజలు విశ్వాసంతో నడుచుకున్నారు;
🔺న్యాయాధిపతుల గ్రందానికి రండి దేవుని ప్రజలు అవిశ్వాసులుగా మారిపోయారు.
👍యెహోషువ గ్రంధంలో దేవుని ప్రజలు విధేయతతో నడుచుకున్నారు;
🔺న్యాయాధిపతుల గ్రందానికి రండి దేవుని ప్రజలు అవిధేయలుగా మారిపోయారు.
👍యెహోషువ గ్రంధంలో దేవుని ప్రజలు విజయలలో నుండి ప్రయాణం చేసారు;
🔺న్యాయాధిపతుల గ్రందానికి రండి దేవుని ప్రజలు అపజయాలో నుండి ప్రయాణం చేసారు.
👍యెహోషువ గ్రంధంలో దేవుని ప్రజలు అభివృధి చెందుతూ వెళ్లారు;
🔺న్యాయాధిపతుల గ్రందానికి రండి దేవుని ప్రజలు కృంగిపోతు కనిపిస్తారు.
👍యెహోషువ గ్రంధంలో దేవుని ప్రజలను నడిపించే నాయకుడు ఉన్నాడు;
🔺 న్యాయాధిపతుల గ్రందానికి రండి దేవుని ప్రజలను నడిపించే నాయకుడే లేకుండా పోయాడు.

👉అందుకే దేవునిని ఎరుగని తరం పుట్టుకొచ్చింది, ప్రజలు ఇష్టానుసారంగా మారిపోయారు.
దేవుని భయంలేదు, దేవుని నిబంధనలు గుర్తులేవు, విచక్షణ అనేదే లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే నోవహు కాలంనాటి జనంలా మారిపోయారు.
ఈ పరిస్థితిని మోషే ముందుగానే ఉహించాడు పడే పడే హెచ్చరించాడు (ద్వితి31:27).

విచ్చలివిడితనం, విగ్రహారాధన, విలువలులేనితనం అన్ని కలసి ఆ ప్రజలపై శాపాన్ని తెచ్చిపెట్టింది.
దేవుని కాపుదలను పోగొట్టుకున్నారు. శత్రుబలం ముందు ఓడిపోయారు. చివరికి వారు బానిసలుగా మారిపోయారు.
దేవుడే తన ప్రజలను చెరకు అప్పగించే పరిస్థితిని ఆ ప్రజలే తమకుతాముగా తెచ్చుకున్నారు.
అలా ఆ దేవాధి దేవుడు ఆ ప్రజలలోవున్న అవిధేయతను, అపవిత్రతను తుదిచివేయటానికే చూసారు కానీ వారిని పూర్తిగా నాశనానికి అప్పగించలేదు ఎందుకంటే "దేవుడు ఇశ్రాయేలీయుల పితరులతో చేసిన నిబంధన కారణంగా".

👉ప్రజలు ఎప్పుడైతే దారి తప్పుతారో అప్పుడు చెర వారి మీదకి వచ్చిపడేది.
👉మరలా ఆ ప్రజలు ఎప్పుడైతే తప్పులు తెలుసుకుని పచ్చాతాపం చెందుతారో అప్పుడు వారికీ విడుదల వచ్చేది. . . .
➡న్యాయాధిపతుల గ్రంధం అంతయు కూడా అవిధేయత.... చెర.... పచ్చాతాపము.... విడుదల.... అనే చేక్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

💎 ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.... దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరకు అప్పగించినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలలో ఎంతమంది వీరులున్నా వారు ఓడిపోయి చెరకు వెళ్ళేవారు.

💎అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరనుండి విడిపించాలి అనుకుప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలలో సాధారణమైన వ్యక్తులను ఎన్నిక చేసి వారిచే అసాధారణ కార్యములు చేయించి మరీ దేవుడు తన ప్రజలను చెరనుండి విడిపించేవారు.

1⃣ఒత్నీయేలు.... కాలేబు తమ్ముడి కుమారుడు, సాధారణమైన వ్యక్తి. అరామ్నహరాయిము యొక్క రాజును జయించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేను.
2⃣ఎహుదు.... రెండంచులుగల మూరెడు కత్తితో ఎగ్లోను అను రాజును జయించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేను.
3⃣షమ్గరు.... మునుకోల కర్రతో 600 మంది ఫిలిష్తియులను జయించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేను.
4⃣దేబోరా, బారాకు... వీరితోపాటు ఆ కాలంలో ఒక గుడారం మేకు మరియు ఒక సుత్తి కలిసి యుద్దాన్ని ముగించాయి, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అందించాయి.
5⃣గిద్యోను.... కాళ్ళి కుండలతో దివిటిలతో శత్రువులను పరుగులుతీయించాడు.
6⃣యోఫ్తా.... ఎన్నికలేని వ్యేశ్యకుమారుడు. తన పరాక్రముచే 18 సం!!రాల చెరను జేయించాడు.
7⃣సంసోను.... గాడిద దవడ ఎముకతో వెయ్యిమంది ఫిలిష్తియులను అటుతరువాత మరణ సమయంలో 3000+ మందిని జయించి. ఇశ్రాయేలు ప్రజలకు తాత్కాలికగానేనా శత్రుబాధ లేకుండా చేసాడు.

నా ప్రియ స్నేహితులారా. . . .గమనించండి.
🔺ఎహుదుకి రెండచ్చుల మూరెడు కత్తి....
🔺షమ్గరుకి మునుకోల కర్ర....
🔺దేబోరా, బారాకుకు ఒక మేకు, ఒక సుత్తి....
🔺గిద్యోనుకు కాళీకుండ, దివిటి....
🔺సంసోనుకు గాడిద దవడ ఎముక....
సాదారణమైన వ్యక్తులు ఇంకా సాదారణమైన ఆయుధాలు కానీ దేవుడు వారికిచ్చిన విజయాలు అసాధారణమైనవి, అద్భుతమైనవిగా కనిపిస్తాయి.

నేడుకూడా మనదేశం విగ్రహారాధనతో, అన్యఆచారాలతో చెరపట్టబడియుంది. అక్రమము, అవినీతితో చెరపట్టబడియుంది. ధనవ్యామోహం, వేషధారణభక్తితో చెరపట్టబడియుంది. మన దేశాన్ని విడిపించే వారు కావాలి.
దేవుడు సాధారణమైన వాళ్లనే ఎన్నుకుంటారు. . . .
వారిచేతికి సాధారణమైన ఆయుధాలే ఇస్తారు. . . .
కానీ అసాధారణమైన విజయాలగుండా తీసుకునివెళ్తారు. . . .

ఈ దేవుని పనిలో మనం కూడా ఒక భాగం కావాలంటే చేయవలసింది ఒక్కటే
యేసయ్య పాదాలచెంతకుచేరి “ యేసయ్య... నన్ను మీ చిత్తంలోనికి తీసుకోండి, నా చేతికి సాధారణమైన ఆయుధాలే ఇవ్వండి, మీ కొరకు అసాధారణమైన కార్యములు చేయుటకు నన్ను నిలబెట్టండి” అని హృదయపూర్వకముగా ఎడతెగక ప్రార్దిచటం.

నా దేవుడు.... సాదారణమైన మనుష్యులనే ఎన్నిక చేస్తారు వారిచేత అసాధారణ విజయాలు పొందుకుంటారు.

హల్లెలూయ. . . .

దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.
---------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి