22, మే 2017, సోమవారం

✳ విగ్రహారాధన ✳ (మొదటి భాగము)

✳ విగ్రహారాధన ✳
(మొదటి భాగము)

👉 విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.
👉విగ్రహారాధన అంటే?
విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.
అదేనా?
నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని.
కాని, ఒక్క విషయం!
విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు.
👉 దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
👉నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
➡ దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్?
నీ హృదయం దేనితో నిండిపోయింది?
•గాళ్ ఫ్రెండా?
•బాయ్ ఫ్రెండా?
•మోటార్ బైక్సా?
•వస్త్రాలా?
•సెల్ ఫోన్సా?
•బంగారమా?
•ధనమా?
•ఆస్థులా?
•అంతస్తులా?
•నీ పిల్లలా?
•అసూయా?
•ద్వేషమా? ఏది?
ఇవన్నీ విగ్రహాలే.
ఇప్పుడు చెప్పగలవా?
నేను విగ్రహారాధికుడను కాదని.
ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ?
ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా?
అందుకే కదా!
సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?
ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది.
నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా?

✳ ఉదయం లేచినవెంటనే, యేసు ప్రభువు వారి ఫోటో చూసుకోవడం చాలామందికి ఒక అలవాటు.
ఇంతకీ ఆ ఫోటో యేసు ప్రభువు వారిదేనా?
ఎవరు తీసారు?
ఒక్క విషయం ఆలోచించు!
యేసు ప్రభువు వారు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది.
కెమెరా కనిపెట్టి రెండు వందల సంవత్సరాలు కూడా కాలేదు.
లియోనార్డ్ డావెన్సి 'ది లాస్ట్ సప్పర్' అనే అద్భుతమైన చిత్రంలో ఏసుప్రభువు వారు తన శిష్యులతో పస్కా ను భుజిస్తున్నట్లు చిత్రించాడు.
ఆయన యేసు ప్రభువు వారిని చూసాడా అంటే? లేదు. యేసు ప్రభువు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు.
యేసు ప్రభువును స్వయంగా చూచిన చిత్రకారుడెవరైనా ఆయన చిత్రాన్ని గీసారా అంటే? అట్లా జరగలేదు.
యేసు ప్రభువుగా చెప్పుకొంటున్న
ఆ రూపం ఈలోకంలోనికి ఎట్లా వచ్చింది?
యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించిన తర్వాత ఆయన దేహం అరిమతయి యోసేపుకు ఇవ్వబడింది. అప్పుడు ఆయన ముఖాన్ని తెల్లని వస్త్రంతో తుడవగా, ఆయన ముఖస్వరూపం రక్తపు మరకల రూపంలో దాని మీద ముద్రించ బడింది.
తర్వాతి కాలంలో ఆ ముద్రికలను ఆధారం చేసుకొని 'బహుశ' యేసు ప్రభువు రూపం ఇట్లా వుండవచ్చేమో? అని ఒక ఊహా చిత్రం గీసారు. ఆ ఊహా చిత్రమే దేవుడై పోయాడు.
దానినే మందిరాలలోనూ, మన గ్రుహాల్లోనూ పెట్టుకొని ఆరాదిస్తున్నాం.
ఎవరో బొమ్మలను చేసుకొని పూజిస్తున్నారు అని చెప్పేనీవు, నీవు చేస్తున్నదేమిటో?
'దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
నిర్గమ 20:4
ఆయన 'ఒక అనిర్వచనీయమైన అధ్వితీయ శక్తి'. ఆయన శక్తిని, ప్రేమను, ఉగ్రతను చిత్ర పటంలోగాని, విగ్రహంలోగాని, చూడలేవు.
దేవునికి చెందాల్సిన మహిమ వాటికి చెందడానికి వీలులేదు. అట్లా చేస్తే నీకంటే విగ్రహారాధికుడు మరెవ్వరూ లేరు.
'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
వద్దు!
ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

----------------------------------------------------

20, మే 2017, శనివారం

Christian Wonders

*"ಕ್ರೈಸ್ತತ್ವವು ಒಂದು ಮತವೆಂದೂ ಕ್ರೈಸ್ತ ಸಂಸ್ಕೃತಿಯು ವಿದೇಶಿಯರ ಸಂಸ್ಕೃತಿ ಎಂದೂ ಹೇಳಿ ಕ್ರೈಸ್ತ ಜನರನ್ನು ತಿರಸ್ಕರಿಸಿ ಕ್ರೈಸ್ತರನ್ನು ದ್ವೇಷಿಸುವ ಜನರಿಗೆ ನನ್ನ ಒಂದು ವಿನಂತಿ," -*
*ನಿಜವಾಗಿಯೂ ನೀವು ಕ್ರೈಸ್ತರನ್ನು ದ್ವೇಷಿಸುವದಾದರೆ ಅವರು ದೇಶಕ್ಕೆ ಮತ್ತು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಕೊಟ್ಟಿರುವ ಕೊಡುಗೆಗಳನ್ನು ಸಹ ನೀವು ತಿರಸ್ಕರಿಸಬೇಕೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ,*
*ಏಕೆಂದರೆ, ಕ್ರೈಸ್ತರು ನಮಗೆ ಬೇಡವೆಂದು ಹೇಳಿ ಕ್ರೈಸ್ತರು ಕೊಟ್ಟ ಕೊಡುಗೆಗಳನ್ನು ಅಂದರೆ ವಸ್ತುಗಳನ್ನು ಮಾತ್ರ ನೀವು ಉಪಯೋಗಿಸುವದರಲ್ಲಿ ಅರ್ಥವಿಲ್ಲ.*
ಕ್ರೈಸ್ತರು ಕೊಟ್ಟ ಕೊಡುಗೆಗಳು ಒಂದಾ.. ಎರಡಾ.. ಎಣಿಸುತ್ತಲೇ ಹೋದರೆ ಬಹಳವಾಗಿವೆ.
ಕೆಲವೊಂದನ್ನು ಮಾತ್ರ ಆರಿಸಿ ನಿಮಗಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆದಿದ್ದೇನೆ.

1) *ಪೇಪರ್, ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಡಿ ಮತ್ತು ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಯಾಕೆಂದರೆ ಪ್ರಿಂಟಿಂಗ್ ಪ್ರೆಸ್ ಕಂಡುಹಿಡಿದದ್ದು
*"ಜಾನ್ ಗುಟೆನ್ ಬರ್ಗ್"* (ಜರ್ಮನಿ-1455)

2) *ಕೈ ಗಡಿಯಾರವನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*"Patek philippe"* (Hungery-1868)

3) *ಟ್ರೈನ್ ಹತ್ತಬೇಡಿ,*
ಟ್ರೈನ್ ಕಂಡುಹಿಡಿದವರು-
*"ರಿಚರ್ಡ್ ಟ್ರಿವಿತಿಕ್"* (ಬ್ರಿಟನ್,-1804)

4) *ಕಂಪ್ಯೂಟರ್ ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*Charles Babbage* (London- 1838)

5) *ಟೈಲರ್ ಮೆಷಿನ್ ನಿಂದ ಹೊಲಿದ ಬಟ್ಟೆಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*ತಿಮ್ಮೇನಿಯರ್* (ಫ್ರಾನ್ಸ್- 1829) Barthelemy thimennier

6) *ವಿದ್ಯುತ್ ಬಲ್ಪ್ ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*ಥಾಮಸ್ ಅಲ್ವ ಎಡಿಸನ್* (ಅಮೇರಿಕಾ- 1879)

7) *ಯಾವುದೇ ವಸ್ತುಗಳಿಗೂ ರಬ್ಬರ್ ಅನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*ಚಾರ್ಲೆಸ್ ಗುಡ್ ಇಯರ್* (ಅಮೆರಿಕಾ-1839)

8) *ಬಟ್ಟೆಗಳನ್ನು ಇಸ್ತ್ರಿ Iron ಮಾಡಬೇಡಿ,*
ಇಸ್ತ್ರಿ ಪೆಟ್ಟಿಗೆ ಕಂಡುಹಿಡಿದವರು
*Henry w seeley* (ಅಮೆರಿಕಾ- 1882)

9) *ಮೋಟಾರ್ ಬೈಕ್ ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*ಕಾನ್ ಸ್ಟಾಟ್* (ಜರ್ಮನಿ- 1885)

10) *ಪೆನ್ನುಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಬಾಲ್ ಪೆನ್ ಕಂಡುಹಿಡಿದವರು
*ಜಾನ್ ಲೆಡ್* (ಅಮೆರಿಕ- 1888)

11) *ಪೆಟ್ರೋಲ್ ಕಾರುಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*ಕಾರ್ಲೆ ಬೆಂಚ್* (ಜರ್ಮನಿ- 1886)

12) *TV ಯನ್ನು ನೋಡಬೇಡಿರಿ, ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲೂ ಬೇಡಿರಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*Farns worth* (ಅಮೆರಿಕ- 1927)

13) *ಲೇಜರ್ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಡಿರಿ,*
ಲೇಜರ್ ಕಿರಣಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*Maiman* (ಅಮೆರಿಕ- 1960)

14) *Hot air balloon ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ, (Parachute)*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*ಜೋಸೆಫ್* (ಫ್ರಾನ್ಸ್- 1783)

15) *ಕುರುಡುತನಕ್ಕಾಗಿ ಕನ್ನಡಕವನ್ನು (Power Glass) ಉಪಯೋಗಿಸಬೇಡಿ,*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದವರು
*ಬೆಂಜಮಿನ್ ಪ್ರಾಂಕ್ಲಿನ್* (ಅಮೇರಿಕ- 1784)

16) *ಬ್ಯಾಟರಿಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ.*
ಬ್ಯಾಟರಿ ಕಂಡುಹಿಡಿದದ್ದು
*Volta* (ಇಟಲಿ- 1800)

17) *ಸೈಕಲ್ ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ.*
ಸೈಕಲ್ ಕಂಡುಹಿಡಿದವರು
*ಮಾನ್ಮಿಲಾನ್* (ಬ್ರಿಟನ್-1840)

18) *ಟೈರ್ ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ.*
ಟೈರ್ ಕಂಡುಹಿಡಿದದ್ದು
*William Thomson* (ಬ್ರಿಟನ್-1845)

19) *ಅಂತಸ್ತುಗಳನ್ನು ಲಿಫ್ಟ್ ನಲ್ಲಿ ಹತ್ತಬೇಡಿರಿ*
ಲಿಫ್ಟ್ ಕಂಡುಹಿಡಿದದ್ದು
*ಎಲೀಷ ಓಟಿಸ್* (ಅಮೆರಿಕ-1853)

20) *ಫ್ರಿಡ್ಜ್ - Refrigerator ಉಪಯೋಗಿಸಬೇಡಿ*
ಅದನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*Jacob parking & Oliver Evans* (ಅಮೆರಿಕ-1834)

21) *ವಿಮಾನಗಳಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸಬೇಡಿ*
ವಿಮಾನವನ್ನು ಕಂಡುಹಿಡಿದದ್ದು
*ರೈಟ್ ಬ್ರದರ್ಸ್* (ಅಮೆರಿಕ-1903)

ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಇದೆ,
*ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ಮತ್ತು ಯೇಸುವನ್ನು ನಂಬಿದ ಜನರನ್ನು ತಿರಸ್ಕರಿಸಬೇಕು ಎಂದು ಹೇಳುತ್ತಾರಲ್ಲ, ಕ್ರೈಸ್ತರು ನಿಮಗೆ ಬೇಡವೆಂದ ಮೇಲೆ ಕ್ರೈಸ್ತರು ಕೊಟ್ಟಿರುವ ಕೊಡುಗೆಗಳು ನಿಮಗೇತಕ್ಕೆ.?*
*ಕ್ರೈಸ್ತರ ಮೇಲೆ ನಿಮಗೆ ನಿಜವಾಗಲೂ ದ್ವೇಷವಿರುವದಾದರೆ ತಕ್ಷಣವೇ ಈ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ತ್ಯಜಿಸಿಬಿಡಿ.*

*ನಮ್ಮ ದೇಶದ ಜನರು ಉಡುಪುಗಳನ್ನು ಧರಿಸುವದರಲ್ಲಿ ಬಹಳ ಬದಲಾವಣೆಗಳಾಗಿವೆ, ಈ ಬದಲಾವಣೆ ಎಲ್ಲಿಂದ ಆಯಿತು.?*
*ಗಂಡಸರು ಸೂಟು ಬೂಟು ಹಾಕಿಕೊಳ್ಳುವದು ಪ್ಯಾಂಟ್ ಶರ್ಟ್ ಗಳನ್ನು ಹಾಕುವುದು ಎಲ್ಲಿಂದ ಕಲಿತರು. ಈಗಿನ ಅನೇಕ ರೀತಿಯ ಸ್ಟೈಲ್ ಗಳಲ್ಲಿ ಉಡುಪುಗಳು ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತಿವೆ,? ಅಥವಾ ಇಲ್ಲಿನ ಕಂಪನಿಗಳು ಆ ಉಡುಪುಗಳನ್ನು ಯಾರಿಂದ ನಕಲುಮಾಡುತ್ತಿವೆ.?*
*ಎಲ್ಲವೂ ವಿದೇಶಗಳಿಂದ ತಾನೇ,*
👉🏼 *ನಮ್ಮ ದೇಶದ ಸಂಸ್ಕೃತಿ ಇದಲ್ಲ.*
👉🏼 *ಹೆಂಗಸರು ಸೀರೆಯನ್ನು, ಗಂಡಸರು ಕಚ್ಚೆ ಮತ್ತು ಪಂಚೆಯನ್ನು ಹಾಕುವುದು ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ.*
ನಿಜವಾಗಿಯೂ ನಮ್ಮ ಹಿಂದುತ್ವವನ್ನು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ನೀವು ಗೌರವಿಸುವುದಾದರೆ ಸೂಟು ಬೂಟುಗಳಿಗೆ ಗುಡ್ ಬೈ ಹೇಳಿ, ಕಚ್ಚೆ ಪಂಚೆಯನ್ನು ಧರಿಸಿರಿ.
🌹 *ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಶಾಂತಿಯನ್ನು ಹುಟ್ಟುಹಾಕಿದ್ದು ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದು ಅನೇಕರಿಗೆ ಗೊತ್ತಿರುವ ವಿಷಯ, ಕ್ರೈಸ್ತರು ಶಾಂತಿಯನ್ನು ಬಯಸುವವರು, ಶಾಂತಿಯನ್ನು ಸಾರುವವರು ಆಗಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ವಿನಾಕಾರಣ ಕ್ರೈಸ್ತರ ಮೇಲೆ ಇಲ್ಲಸಲ್ಲದ ಆರೋಪಗಳನ್ನು ಹೊರಿಸಿ ಅವರನ್ನು ಹಿಂಸಿಸುವುದು ಸರಿಯಲ್ಲ. ಹಿಂಸೆಯ ಕೃತ್ಯಗಳನ್ನು ನಡೆಸಿ ದೇಶದ ಶಾಂತಿಯನ್ನು ಕೆಡಿಸಬೇಡಿ, ಎಂದು ಕ್ರೈಸ್ತರನ್ನು ವಿರೋಧಿಸುವವರಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.* 🙏
*ಸತ್ಯವನ್ನು ಅರಿತು ಸತ್ಯದಲ್ಲಿ ಬಾಳಿರಿ*

14, మే 2017, ఆదివారం

కయ్యినుకు భార్య ఎక్కడ నుండి వచ్చినద

✳కయ్యినుకు భార్య ఎక్కడ నుండి వచ్చినది....??????

👉1) అటు bible నమ్మిన వారిని,ఇటు bible నమ్మని వారిని వేదిస్తున్న ప్రశ్నలలో ఒకటే ఈ కయ్యినుకు భార్య ఎక్కడి నుండి వచ్చినది??భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మనుష్యులందరికీ ఆదామే తండ్రని bible భోదిస్తుంది. ఆదాము హవ్వల ప్రధమ గర్భ ఫలమైన కయ్యినుఅతని తమ్ముడైన హేబెలును చంపి దేవుని సన్నిధి నుండి భయలదేరి ఎదేనుకు తూర్పు దిక్కుననున్న నోదు దేశములో కాపురమున్నప్పుడు అతడు తన భార్యను కూడగా అతనికి కుమారుడు పుట్టేనని bible నందు వ్రాయబడింది. కయ్యిను భార్య ఎక్కడ నుండి,ఎవరి వలన వచ్చినదనియు, ఏదేను తోటకు తూర్పు దిక్కున నొదు అను దేశము ఎట్లు పుట్టెనను సందేహము bible చదువువారికి కలుగును.
👉2)ఆదాము వలన సంతతి కాకుండా మిగిలిన మరెవరి వలనైన సంతతులు భూమి మీద ఉన్నవా?? ఒక వేళ అట్టిసంతతులు భూమి మీద ఉన్నట్లు అయితే ఆదాము మొదటి మానవుడు కాడనియు ,భూమి మీద పుట్టుకొస్తున్న వారంతా ఆదాము సంతతి అనుకొనుటకు అధరాలు లేవని తలంచవచ్చు. ఆదాము నుండి నోవాహు కాలము వరకు సుమారు 1000 years ఆయుష్షు కాలము దేవుడు నరులకు ఇచ్చెనని ఆదికాండము 5వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. ఇక ఆదాము 130వ ఏట షేతును కనగా షేతు 105 ఎండ్లకే కుమారుని కనెను. ఎనోషు 90 yearsకే కుమారుని కనగా కేయునాను 70 ఏళ్లకే కుమారుని కనెను. అనగా మొదటి 100 years లోనే వీరంతా సుమారుగా కుమారులను,కుమార్తెలను కనినట్లుగా ఆ అధ్యాయంలో కనిపించుచున్నది.
👉3) ఇక ఉదాహరణలోకి వెళ్తే ప్రస్తుతము మానవ ఆయుష్షు కాలం సుమారు 70 ఏళ్లనీ చెప్పుకొనవచ్చు. ఈ కాలమును బట్టి nithin తన 20 ఏటనే పెళ్లి చేసుకుంటే తండ్రి కావచ్చు. Nithinకి 40 ఏండ్లు వచ్చునప్పటికిnithinకుమారుడు కూడతండ్రి కావచ్చు. మరలాnithinకి 60 ఏండ్లు వచ్చినప్పుడుమనముడు తండ్రి కావచ్చు.అధిక బలముండి nithin80 ఏండ్లుఒక వేళ బ్రతికితే nithin ముని ముని మనముడు కూడా తండ్రి కావచ్చు. ఉదాహరణను పరిశిలిస్తే nithin 80 ఎటకే 3 తరములను చూడగలుగుచున్నాడు. ఈ 3 తరాలలో వారి వారి గర్బముల నుండి పుట్టిన వారు ఎంత మంది కాగలరో మీరు ఊహించవచ్చు.కేవలం 80 years బ్రతికిన వారికే ఇన్ని తరాలు ఉన్నప్పుడు మరి ప్రారంభ కాలములో మనుష్యులు సుమారు 1000 years బ్రతికినప్పుడు ఆ వెయ్యి ఎండల్లో ఎన్ని లక్షల మందిని వారు కనియుండగలరో సులువుగా లెక్కలు కట్టవచ్చు.
👉4) కయ్యిను ఆదామును విడిచిపోయిన తరువాత అది దంపతులైన ఆదాము హవ్వులకు తిరిగి కుమారులు ,కుమార్తెలు పుట్టినట్లుగా bible నందు వ్రాయబడింది( ఆదికాండము 5:1-5& 4:24). ఆ సంతతిలోని వారే నొదు దేశంలో కయ్యిను చోటికి చేరి వారిలో ఒక స్త్రీని కయ్యినుకు భార్యగా చేయబడింది. ఆదాము సంతతి నుండి వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ కయ్యినుకు భార్యగా చేయబడినదని నిస్సందేహముగా చెప్పవచ్చు.
👉5) అయితే ఇక్కడ మరో సందేహమురావొచ్చు. నొదు దేశం ఎట్లు వచ్చినది? ఆదికాండము నుండి ద్వితియోపదేశ కాండము వరకు మొదటి 5 కాండలు వ్రాసిన వ్యక్తి మోషే అని (ద్వితి 31:9,24, సంఖ్య33:2, నిర్గమ 24:4,లూకా 24:44,లూకా 16:31& యోహాను 5:46) ఈ వచనాలు ద్వార తెలుసుకోవచ్చు. దీనిని బట్టి ఆదికాండము అయిపోయిన తరువాతే నిర్గమ కాండంలో పుట్టిన మోషే తాను పుట్టుక,నోవాహు జలప్రళయం, బాబెలు గోపురం,అబ్రహం,ఇస్సాకు ,యాకోబు,ఇశ్రాయేలియుల సంతానమును గూర్చి కొంత వరకు ఆదికాండమును వ్రాసినప్పటికే ఏదేను తోట తూర్పు దిక్కున నొదు దేశము విలసిల్లెను గనుక దాని పేరు ఆదికాండములో వ్రాసెను.
👉6) అనగా కయ్యిను అక్కడికి వెళ్ళినప్పటికీ అది నిర్జన ప్రదేశమే గానీ మరొకటి కాదు. మోషే వ్రాసేటప్పుడు అది నొదు దేశంగా పిలువబడుచున్నది గనుక అప్పుడు తాను వ్రాస్తున్న ఆదికాండములో దానిని నొదు దేశంగా వివరించెను. 50 years క్రితం నిర్మానుష్యంగా ఉన్న ఎన్నో ప్రాంతాలు తరువాత ప్రజలు ఆక్రమించుకొని పల్లెలుగా,పట్టణాలుగా మారుచున్నవి.50 ఏళ్ల క్రితం దానికి ఏ పేరు లేకపోయినప్పటికీ అది ఒక పట్టణంగా మారినప్పుడు దానికంటూ ఒక పేరు పెట్టు పిలుచుట జరుగును. నొదు దేశం పుట్టుక కూడా అట్టిదే. కయ్యిను వెళ్ళినప్పటికీ అది నిర్మానుష్యమైనను మోషే వ్రాసినప్పటికి అది నొదు దేశంగా పిలవబడుచుండెను.....✍
----------------------------------------------------------

1, మే 2017, సోమవారం

* సమరయ స్త్రీ *

✴  సమరయ స్త్రీ   ✴
(మొదటి బాగము)
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!
యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యంలో సమరయ అనే ప్రాంతం వస్తారు. అక్కడ సుఖారు అనే గ్రామ శివారులో యాకోబుగారు యోసేపుకిచ్చిన బావి దగ్గర అలసినరీతినే కూర్చొన్నారు. అప్పుడు ఇంచుమించు పండ్రెండు గంటలయ్యింది అని వ్రాయబడింది.(4,6 వచనాలు)
👉ఏసుప్రభువు యూదుడు. వెళ్ళిన ప్రాంతం సమరయ.
👉ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలలియ అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది. యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది.
👉 అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, *అంటరానివారుగా* పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు.

✳ ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.

➡సమరయ అనగా Watch Tower (కాపలా కోట):
అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకొనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యెశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు. అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు. ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
అయితే ఇటువంటి *అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు*. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం! ఆయన ఆశ్చర్యకరుడు! ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!
👉ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.
👉ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!

వేదము లో క్రీస్తు

📚వేదాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షం!!!📖
భారతదేశ వేద గ్రంథాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినట్లు బైబిల్ గ్రంథం సాక్షం ఇచ్చుచున్నది.
బెత్లేహేం ఎఫ్రాతా! యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. “పురాతన కాలము మొదలుకొని, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.” ( మీకా 5: 2 ).
మానవజాతి మనుగడ ఈ భూమిపై ప్రారంభమైనది మొదలుకొని అన్ని కాలములలోనూ, అన్ని దేశాలవారికి, అప్పుడప్పుడు అక్కడక్కడ యేసుప్రభువు దర్శనము ఇస్తూనే వున్నారని దీని భావము. భారతదేశములోని ఋషులకు తాత్వికులకు కూడా యేసుప్రభువు దర్శనము కలిగినది. కావున మన పురాతన వేదాలలో యేసుప్రభువు దర్శనము ఉన్నదనుటకు సందేహము లేదు.
పూర్వకాలములలో నానా సమయములలోనూ.......... ప్రవక్తల ద్వారా మన పితరులతో (ఋషులకు తాత్వికులకు) మాట్లాడిన దేవుడు ( హెబ్రి 1: 1 ) పూర్వకాలమందు పితరులతో మాట్లాడినట్లు యెషయా గ్రంధములో తేటగావ్రాయబడెను. ( యెషయా 15 : 19-21 ) దేవునిగూర్చిన మర్మము క్రీస్తు నందు ప్రత్యక్షమైనది ( కొలస్సీ1: 25-27, రోమా 1 : 25,26, ఎఫెస్సీ 3 : 1- 3 ).
యేసు క్రీస్తంటే ఎందుకింత వ్యతిరేఖత?
క్రైస్తవ ఉపదేశానికి ఈ మధ్య బాగా వ్యతిరేఖత పెరిగిపోయింది. క్రైస్తవులు భోదించేది వేదాలకు వ్యతిరేఖంగా ఉందా ?
వేద వాఙ్మయములో క్రీస్తును గూర్చి చాలా సంగతులున్నాయి. బైబిలు గ్రంథం లోని
ఆధ్యాత్మిక దర్శనం వేదాలలో కూడా ఉంది.
భారతీయులు కూడా చక్కగా వేదాలు చదివితే, క్రీస్తు దర్శనం కూడా వేదాలలో ఉందని అర్థం అవుతుంది. అప్పుడు వ్యతిరేఖ ధోరణి ఉండదు. సంస్కృతం లో ఉన్న వేదాలను తెలుగులోకి అన్వదించిన
డా: దాశరథి రంగాచార్యులు గారు అభినందనీయులు.
యేసుక్రీస్తును గూర్చి బైబిలులోని పాతనిబంధనలో సవిస్తరంగావ్రాయబడిఉన్ననూ, యూదులకు వారి గ్రంథములో వున్న యేసుప్రభువు ప్రత్యక్షత అర్థం కాలేదు. అందుకే ఆయన ఎవరో అనుకోని శిలువ వేశారు. అయితే మర్మము వ్యతిరేకించిన వారికొరకు ప్రభువు ప్రార్థన.
“తండ్రీ! వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు” అన్నాడు. ( లూకా 23 : 34).
ఈ చిన్ని గ్రంథమందు అనేకమైన వేదవాక్యాలు వాటి భావాలు వ్రాయబడ్డాయి. సహృదయంతో చదవండి.
యేసుక్రీస్తు అవతారము
📚సామవేదము:
శ్లోకము : “లిహ్వ్య గోప్తారామ్ మహా క్యౌదదిన హ వ్యాయాన పర్యతాసీన్”
భావము: అవతరించ బోవువాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించును.
📖బైబిలు: కన్యక ( మేరీ ) గర్భమున పశువుల పాకలో జన్మించిన నరావతారి యేసుప్రభువు! కన్యక గర్భవతియై కుమారుని కనును అని యేషయా అను మహర్షి (ప్రవక్త ) క్రీస్తు పూర్వము 730 సం. లకు పూర్వమే ప్రవచించెను. పశువుల పాకలో జన్మించునని యోబు 36 : 33; యేషయ 7 : 14 లో ఉన్నది.
📚భవిష్య పురాణం :
శ్లోకము: “ఈషపుత్రం చమాం విద్దీ కుమారీ గర్భ సంభవం
మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం మసేహుహమ్ సమాగతః”
భావము: దేవునికుమారుడు కన్యక గర్భమున జన్మించాలి మరియు ఆయన పాపులను నీతిమంతులుగా మార్చుటకు ప్రవక్తగాను మెస్సయా గాను అవతరించును.
📖బైబిలు: ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు “యేసు” అను పేరు పెట్టబడును. ( లూకా 1 : 26-35 )
పాపులను రక్షించుటకు ( నీతిమంతులను గా చేయుటకు ) యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ( 1 తిమోతి 1: 15; చదవండి. )యాకోబులో ఉదయించును. ( ప్రకటన 22 : 16 చదవండి.) నేను దావీదు వేరు చిగురును. సంతానమును ప్రకాశమానమైన వేకువ చ్చుక్కనై ఉన్నాను. క్రీస్తు జన్మించినపుడు తూర్పుదేశపు జ్ఞానులు ( అనగా ఇందులో భారత దేశపు ముని పుంగవు లున్నారు) ఆయన నక్షత్రమును చూశారు. ( మత్తయి 2: 2 – 9 ) చదువగలరు.
📚ఋగ్వేదము:
శ్లోకము: “ యేషః దేవః ప్రదిశ్రోను సర్వాః పూర్వోహిజాపః
న - ఉ – గర్భే – అంతః సయేవదేవః జన్షిణ్యమాణ:”
భావము: యేసు అన్నిదిశలలో మహా దేవుడై ఉన్నాడు. తూర్పు దేశ మందు పరిశుద్దమైన కన్య (స్త్రీ ) గర్భమున అవతరించును. ఈయనే నిజమైన దేవుడు, ప్రజలందరూ ఎదురుచూస్తున్న దేవుడు, పాపములేని మహా పరిశుద్దుడు ఈయనే.
📖బైబిలు: యేసుక్రీస్తు పరిశుద్దుడు అని దూతలు పాడి సాక్షామిచ్చుచున్నారు. ( యేషయ 6: 2,3; ప్రకటన 4 : 8 ) నాలోపాపమున్నదని ఎవరైనా చూపించగలరా? అని తన పాపరాహిత్యాన్ని ప్రకటించినవాడు. (యోహాను 8 : 7,8; 1 యోహాను 3 :5 ; లూకా 1 : 35; యోహాను 6 : 39; హెబ్రీ 7 : 26; ఆపో.కా 3 : 14 )
యేసుక్రీస్తు మరణమును జయించుట
యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేస్తాడని వేదాలలో వ్రాయబడి వుంది. ( చనిపోయి ప్రాణ ప్రతిష్ట చేయబడుట ).
📚ఋగ్వేదమందు బలిపశువు:
శ్లోకము : “చత్వార శృంగ త్రయో అన్య పాదాద్వే శీర్షేసప్తహస్తా సో త్రిధాబద్దో వృషభో రారవాతి –
మహాదేవో మర్థ్యాగమ్ అవివేశః”
భావము: మహాదేవో = మహాదేవుడు
మర్థ్యాగమ్ = మనుష్య రూపంలో
అవివేశ = గొర్రెపిల్లలాంటి శాంత మూర్తి
త్రిబద్దో = ముడుమేకుల మీద వ్రేలాడ వేయుట
వృషబో రోరవాతి = బలి పశువు ( పస్కా పశువు)
ద్వీపాద హస్తాసో = రెండు పాదములు రెండు చేతులలోనూ మేకులు కొట్టుట.
శీర్షే సప్త = ఏడుమేకులు గల సిరాస్తానమ్ 2 తిమోతి 2 : 5,6 ).
జ్యోతిస్వరూపుడు నక్షత్రమై ఆవిర్భవించుట.
ఋగ్వేదం- శ్లోకము: “అంభస్య పారే భావనస్యమద్యే నాకస్యవృష్టే మహతొ మహీయాన్
శుక్రేణ జోతిగ్గంషి – స –అనుప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే అంతః”
భావము: ప్రజాపతి ( సృష్టికర్త ) యైన దేవుడు ( యేసుక్రీస్తు ) భూమిమీద అవతరించినపుడు మహామహిమతో ఆకాశ మందు ఒక నక్షత్రం ఆవిర్భవిస్తుంది.
📖బైబిలు: నక్షత్రం ఆవిర్భవించుటను గూర్చి ప్రవచనము చూడండి. ( సంఖ్యా 24 : 17 పెట్టారు.)
బైబిలు : మానవుల పాపములు ప్రక్షాళన చేయుట కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ( బలిపశువుగా) యజ్ఞము చేయబడినాడు. మానవుల పాపశిక్షను తానే భరించి , ఆయన శరీరము నందు పాపమునకు శిక్ష విధించెను. : ( రోమా 5 : 6-8,రోమా8 :4 , మత్తయి 27 :27-50, యోహాను 19 :16 - 30, పిలిప్పీ 2 :7 )పై ఋగ్వేదము శ్లోకము క్రీస్తు లో నెరవేరింది.
ఆర్యులర్పించిన బలులు.
ఆర్యులనువారు అర్పించిన బలులు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాయి. చదవండి.
దహనబలి : ఆది కాండము 8:20, నిర్గమా 29 : 18, లేవికాండము 1 : 4.
పాపపరిహారార్థబలి : లేవీ కాండము 5 : 7 – 9, లేవీ కాండము 6 : 8 -13. కలది కాదు. (నిజస్వరూపం క్రీస్తే). హెబ్రీ 10 : 4 ఏలాయనగా ఎడ్లయొక్కయు, మేకలయొక్కయు రక్తము వలన పాపములు తీసివేయుట ఆసాద్యము. హెబ్రీ 10 : 5-7 వరకు చదవండి అక్కడ ఈ విధంగా వ్రాయబడింది.
బలియు ఆర్పణయు నీవు కోరుటలేదు. పాపపరిహారార్థ బలులును నీకీస్టమైనవి కావు.
క్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగును. యేసురక్తం ప్రతిపాపం నుండి మనలను ప్రవిత్రులుగా చేయును. (1 యోహాను 1 : 7 -9; మత్తయి 26 : 28; 1 పేతురు 1 : 19.)
మన పురాతన ఋగ్వేదము--- యజ్ఞ పశువు అర్హతలు
ఋగ్వేదము ( బలిపశువు ) బైబిలు( యేసు క్రీస్తు) సమాదానార్థమైన బలి : నిర్గమా కాండము 20 : 24, లేవీ కాండము 23 : 19.
ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల ( యోహాను 1 : 29)
ఈయనే మన పస్కా బలి పశువు ( 1 కోరంథి 5 : 7 )
📚సామవేదము: తాండియ బ్రాహ్మణము :
శ్లోకము : “ప్రజాపతిర్థేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్”
భావము : అనగా దేవుడు తానే మన పాపముల కొరకు తన ఆత్మను యజ్ఞం లో కాల్చుకొని ప్రాయశ్చిత్తమై మనలను విమోచించును.
మానవుడు పుట్టుకతోనే పాపస్వభావం కలవాడు. పాపం చేస్తూబలహీనుడై చివరకు పాపమునకు దాసుడై పోయాడు. ఈ దుస్థితినుండి తప్పించుకొనుటకు సకలవిదాల ప్రయత్నం చేస్తూ వున్నాడు, ఐనా విముక్తి పొందలేకపోవుచున్నడు.
క్రీస్తు రక్తం ద్వారా పాప పరిహారం
రక్తప్రోక్షణం ద్వారా మానవులకు పాపవిమోచన కల్గించుటకు మన ఆత్మలను రక్షించుటకు దేవుడు ఒక మార్గమును సిద్దపర్చాడు. క్రింది శ్లోకం చదవండి.
📚సామవేదం:
శ్లోకము :
“సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం ఆవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.”
భావము: విశ్వమానవాళి పాపపరిహారం కొరకు లోకకళ్యానార్థము దేవుడు తన రక్తం చిందించుట ( బలియాగం ) ద్వారా పాపపరిహారం జరుగును.
📖బైబిలు: హెబ్రీ 10 : 1 దర్మశాస్త్రము ( వేదములు) రాబోవుచున్న మేలుల ఛాయాయెగని నిజస్వరూపం ఋగ్వేదము ( బలిపశువు ) బైబిలు( యేసు క్రీస్తు)
అది మచ్చలేనిదిగా వుండవలెను --------------------------------------------1 పేతురు 1 : 19.
ముళ్ళకిరీటం అల్లి దానినితలపై ఉంచవలెను ---------------------------------------మత్తయి 27 :29
రక్తము ప్రవహించునట్లు దాని నాలుగు పాదములయందు మేకులు కొట్టవలెను --------లూకా 24 : 39
దాని వస్త్రములు ఋత్వికులు (యాజకులు) పంచుకొనవలెను -----------------------యోహాను 19 :24;
మత్తయి 27 : 35.
దాని ఎముకలలో ఒకటైనను విరగకూడదు----- -----------------------------------యోహాను 19 :33.
చేదురసము బలి పశువుకు త్రాగిన్చవలెను --------------------------------------మత్తయి 27 : 34.
బలి ఐనా పిదప ప్రాణప్రతిష్ట జేయ వలేను ---------------------------------------మత్తయి 28 : 6 – 10.
దాని శరీర మాంసములను తినవలెను--------------------------------------------మత్తయి 26: 26
ఇవన్నియు 2000 సం,, క్రితం సర్వలోక పాపపరిహారార్థమై శిలువపైన బలిఐన ప్రజాపతి యేసుక్రీస్తును సూచిస్తున్నై
ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ------------------------------( యోహాను 1 : 29 ) 29 )
ఇవన్నియు 2000 సం ,,ల క్రితం సర్వలోక పాపపరిహారార్థమై బలియైన ప్రజాపతి యేసుక్రీస్తును సూచిస్తున్నాయి.
ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ---- యోహాను 1 : 29
బలిపశువు అయిన యేసుక్రీస్తు
మరణమును జయించుట గురించి ఋగ్వేదము తెలియచేయుట.
📚శ్లోకము : “ప్రజాపతిశ్చరతి గర్భేత్వమేవ ప్రతిజాయత్
తుచ్చ్యమ్ ప్రాణప్రజాస్తి మా బలింహరంతయః ప్రాణై ప్రతిష్టతిః”
భావము : ప్రజాప్రతి ( సృష్టికర్తయైన యేసుక్రీస్తు ) యైన దేవుడు కన్యక ( స్త్రీ) గర్భమున జన్మించి, బలిపశువు అయిన యేసుక్రీస్తు
మరణమును జయించుట గురించి ఋగ్వేదము తెలియచేయుట.
📚శ్లోకము : “ప్రజాపతిశ్చరతి గర్భేత్వమేవ ప్రతిజాయత్
తుచ్చ్యమ్ ప్రాణప్రజాస్తి మా బలింహరంతయః ప్రాణైi ప్రతిష్టతిః”
భావము : ప్రజాప్రతి ( సృష్టికర్తయైన యేసుక్రీస్తు ) యైన దేవుడు కన్యక ( స్త్రీ) గర్భమున జన్మించి,
ప్రాణప్రతిష్ట చేయబడిన వాడై మరణం నుండి తిరిగిలేచి పునరుత్తానుడవుతాడు.
📖బైబిలు: యేసుక్రీస్తు తాను చెప్పిన ప్రకారమే చనిపోయి మూడవదినమున ( సమాధి ) మరణంను గెలిచి లేచేను. ప్రభువు చెప్పిన మాటవినండి. “పునరుత్తానమును జీవమును నేనే” యోహాను 11: 25.
ఆయన పునరుత్తానం బైబిలు గ్రంథమందు మత్తయి 18 వ అధ్యాయము, మార్కు 16 వ అధ్యాయము చదవండి మరియు అపోస్తుల కార్యములు 26 : 22; 1 కోరింథి 15 : 1 – 15 ధ్యానించండి.
మరణం ఆయనను బంధించుట అసాధ్యము. అపోస్తుల కార్యములు 2 : 24.
యేసుక్రీస్తు పుట్టుక, జీవితం ఒక మర్మం కాదు. ఇది చరిత్రతో చాలా సంబంధం కలిగియున్నది. ఆయన మధ్య తూర్పు ఆసియాలో ఒక యూదా కుటుంభములో జన్మించెను. అకస్మాత్తుగా కాదు. ఆయన శరీరధారిగా రాకముందే బైబిలునందు పాతనిభంధనలో ఈ సత్యం వివరించబడింది. ఇవన్నీయూ క్రీస్తుపుట్టుకకు ముందు ఎన్నోవందల సంవత్సరముల క్రితం వ్రాయబడినవి.
మొదట మధ్య ఆసియా నుండి ఉత్తర ఇండియాకు వలస వచ్చిన ప్రాచీన ఆర్యులు వ్రాసిన వేదములు రానున్న లోకరక్షకుని గురించియే వివరించుచున్నవి. ( వేదముల సారమంతయు యేసుక్రీస్తునందు నెరవేరునట్లు ) బైబిలు గ్రంధములో వివరించబడెను.
యేసుక్రీస్తు ఇలా సెలవిచ్చారు:
లేఖనములయందు ( వేదములు) మీకు నిత్యజీవమున్నదని తలంచి వాటిని పరిశోదించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్మిచ్చుచున్నవి. ( యోహాను 5 : 39)
నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను. ( యోహాను 14 : 6 )
రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. ( లెవీ కాండము 17 : 17 ) కనుక బలియందు రక్తము తప్పనిసరి. యేసుక్రీస్తు రక్తము ప్రతిపాపమునుండి పవిత్రులనుగా చేయును. ( 1 యోహాను 1 :7 )
మనము పాపము విషయమై చనిపోయి నీతివిషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను ( శిలువ) మీద మోసుకొనెను. ( 1 పేతురు 2 : 24 ). మరియెవని వలనను రక్షణ కలుగదు.
ఈ నామముననే మనము రక్షణ పొందవలయును. ( అపోస్తుల కార్యములు 4 : 12 ).
మానవుడు తన జన్మ కర్మ పాపములను బట్టి నిత్యాగ్ని దండనకు పాత్రుడని తన పాపపరిహారమునకు మార్గం యేసుక్రీస్తేనని, ఆయన ఒక్కడే పాపపరిహార క్రయము చెల్లించిన “ ప్రజాపతి” యని పరిశుద్ద బైబిలు గ్రంధము తేటతెల్లముగా వివరించుచున్నది. కనుక నీ పాపము విషయమై పశ్చ్చాత్తాపపడి క్రీస్తులో నీకున్న పరిహారమును అంగీకరించి నిత్యరక్షణ పొందుమని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుచున్నాము.
దేవుడు ఒక్కడే.
📚ఋగ్వేదము: 10 : 129 : 2.
శ్లోకము: “ న మృత్యురా సీదమృతం నతర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత:
ఆనీరవాతమ్ స్వదయా తదేకం తస్మద్ధాన్యన్న పర: కిం చావాన”
భావము: ఒకప్పుడు జీవమరణములు లేవు.పగలు, రాత్రులు లేవు. స్వయంభవుడైన దేవుడు ఈ సృష్టి కలుగ జేయక మునుపు ఆయన తప్ప మరేదియు లేదు.
📖బైబిలు: ఇదిగో నేను నేనే దేవుడను. నేను తప్ప వేరొక దేవుడులేడు. మృతినొందించువాడనూ, బ్రతికించు వాడానూ నేనే. గాయపరచు వాడానూ, గాయము కట్టు వాడానూ నేనే. నాచేతిలోనుండి విడిపించువాడేవాడునూ లేడు. ( ద్వితీయోపదేశ కాండము 32 :39; యేషయా 43 : 10 -12 వరకు చదవండి.మరియు 1 తిమోతి 6 : 15, 16 ) అందరికీ దేవుడు ఒక్కడే ( 1 1 కోరింథి 8 : 4 – 6 )
దేవుడు – దేవతలు
📚ఋగ్వేదము – 7 : 104 : 14
శ్లోకము: యది వాహమనృత దేవ ఆసమోఘం వా దేవాం అప్యూహే అగ్నే!
కిమస్మభ్యం జాతవేదో హ్రుణీషే ధ్రోషు వాచస్తే నిర్రుధం సఛంథామ్ !!
---------------------------------------------------------