📚వేదాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షం!!!📖
భారతదేశ వేద గ్రంథాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినట్లు బైబిల్ గ్రంథం సాక్షం ఇచ్చుచున్నది.
బెత్లేహేం ఎఫ్రాతా! యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. “పురాతన కాలము మొదలుకొని, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.” ( మీకా 5: 2 ).
మానవజాతి మనుగడ ఈ భూమిపై ప్రారంభమైనది మొదలుకొని అన్ని కాలములలోనూ, అన్ని దేశాలవారికి, అప్పుడప్పుడు అక్కడక్కడ యేసుప్రభువు దర్శనము ఇస్తూనే వున్నారని దీని భావము. భారతదేశములోని ఋషులకు తాత్వికులకు కూడా యేసుప్రభువు దర్శనము కలిగినది. కావున మన పురాతన వేదాలలో యేసుప్రభువు దర్శనము ఉన్నదనుటకు సందేహము లేదు.
పూర్వకాలములలో నానా సమయములలోనూ.......... ప్రవక్తల ద్వారా మన పితరులతో (ఋషులకు తాత్వికులకు) మాట్లాడిన దేవుడు ( హెబ్రి 1: 1 ) పూర్వకాలమందు పితరులతో మాట్లాడినట్లు యెషయా గ్రంధములో తేటగావ్రాయబడెను. ( యెషయా 15 : 19-21 ) దేవునిగూర్చిన మర్మము క్రీస్తు నందు ప్రత్యక్షమైనది ( కొలస్సీ1: 25-27, రోమా 1 : 25,26, ఎఫెస్సీ 3 : 1- 3 ).
యేసు క్రీస్తంటే ఎందుకింత వ్యతిరేఖత?
క్రైస్తవ ఉపదేశానికి ఈ మధ్య బాగా వ్యతిరేఖత పెరిగిపోయింది. క్రైస్తవులు భోదించేది వేదాలకు వ్యతిరేఖంగా ఉందా ?
వేద వాఙ్మయములో క్రీస్తును గూర్చి చాలా సంగతులున్నాయి. బైబిలు గ్రంథం లోని
ఆధ్యాత్మిక దర్శనం వేదాలలో కూడా ఉంది.
భారతీయులు కూడా చక్కగా వేదాలు చదివితే, క్రీస్తు దర్శనం కూడా వేదాలలో ఉందని అర్థం అవుతుంది. అప్పుడు వ్యతిరేఖ ధోరణి ఉండదు. సంస్కృతం లో ఉన్న వేదాలను తెలుగులోకి అన్వదించిన
డా: దాశరథి రంగాచార్యులు గారు అభినందనీయులు.
యేసుక్రీస్తును గూర్చి బైబిలులోని పాతనిబంధనలో సవిస్తరంగావ్రాయబడిఉన్ననూ, యూదులకు వారి గ్రంథములో వున్న యేసుప్రభువు ప్రత్యక్షత అర్థం కాలేదు. అందుకే ఆయన ఎవరో అనుకోని శిలువ వేశారు. అయితే మర్మము వ్యతిరేకించిన వారికొరకు ప్రభువు ప్రార్థన.
“తండ్రీ! వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు” అన్నాడు. ( లూకా 23 : 34).
ఈ చిన్ని గ్రంథమందు అనేకమైన వేదవాక్యాలు వాటి భావాలు వ్రాయబడ్డాయి. సహృదయంతో చదవండి.
యేసుక్రీస్తు అవతారము
📚సామవేదము:
శ్లోకము : “లిహ్వ్య గోప్తారామ్ మహా క్యౌదదిన హ వ్యాయాన పర్యతాసీన్”
భావము: అవతరించ బోవువాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించును.
📖బైబిలు: కన్యక ( మేరీ ) గర్భమున పశువుల పాకలో జన్మించిన నరావతారి యేసుప్రభువు! కన్యక గర్భవతియై కుమారుని కనును అని యేషయా అను మహర్షి (ప్రవక్త ) క్రీస్తు పూర్వము 730 సం. లకు పూర్వమే ప్రవచించెను. పశువుల పాకలో జన్మించునని యోబు 36 : 33; యేషయ 7 : 14 లో ఉన్నది.
📚భవిష్య పురాణం :
శ్లోకము: “ఈషపుత్రం చమాం విద్దీ కుమారీ గర్భ సంభవం
మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం మసేహుహమ్ సమాగతః”
భావము: దేవునికుమారుడు కన్యక గర్భమున జన్మించాలి మరియు ఆయన పాపులను నీతిమంతులుగా మార్చుటకు ప్రవక్తగాను మెస్సయా గాను అవతరించును.
📖బైబిలు: ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు “యేసు” అను పేరు పెట్టబడును. ( లూకా 1 : 26-35 )
పాపులను రక్షించుటకు ( నీతిమంతులను గా చేయుటకు ) యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ( 1 తిమోతి 1: 15; చదవండి. )యాకోబులో ఉదయించును. ( ప్రకటన 22 : 16 చదవండి.) నేను దావీదు వేరు చిగురును. సంతానమును ప్రకాశమానమైన వేకువ చ్చుక్కనై ఉన్నాను. క్రీస్తు జన్మించినపుడు తూర్పుదేశపు జ్ఞానులు ( అనగా ఇందులో భారత దేశపు ముని పుంగవు లున్నారు) ఆయన నక్షత్రమును చూశారు. ( మత్తయి 2: 2 – 9 ) చదువగలరు.
📚ఋగ్వేదము:
శ్లోకము: “ యేషః దేవః ప్రదిశ్రోను సర్వాః పూర్వోహిజాపః
న - ఉ – గర్భే – అంతః సయేవదేవః జన్షిణ్యమాణ:”
భావము: యేసు అన్నిదిశలలో మహా దేవుడై ఉన్నాడు. తూర్పు దేశ మందు పరిశుద్దమైన కన్య (స్త్రీ ) గర్భమున అవతరించును. ఈయనే నిజమైన దేవుడు, ప్రజలందరూ ఎదురుచూస్తున్న దేవుడు, పాపములేని మహా పరిశుద్దుడు ఈయనే.
📖బైబిలు: యేసుక్రీస్తు పరిశుద్దుడు అని దూతలు పాడి సాక్షామిచ్చుచున్నారు. ( యేషయ 6: 2,3; ప్రకటన 4 : 8 ) నాలోపాపమున్నదని ఎవరైనా చూపించగలరా? అని తన పాపరాహిత్యాన్ని ప్రకటించినవాడు. (యోహాను 8 : 7,8; 1 యోహాను 3 :5 ; లూకా 1 : 35; యోహాను 6 : 39; హెబ్రీ 7 : 26; ఆపో.కా 3 : 14 )
యేసుక్రీస్తు మరణమును జయించుట
యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేస్తాడని వేదాలలో వ్రాయబడి వుంది. ( చనిపోయి ప్రాణ ప్రతిష్ట చేయబడుట ).
📚ఋగ్వేదమందు బలిపశువు:
శ్లోకము : “చత్వార శృంగ త్రయో అన్య పాదాద్వే శీర్షేసప్తహస్తా సో త్రిధాబద్దో వృషభో రారవాతి –
మహాదేవో మర్థ్యాగమ్ అవివేశః”
భావము: మహాదేవో = మహాదేవుడు
మర్థ్యాగమ్ = మనుష్య రూపంలో
అవివేశ = గొర్రెపిల్లలాంటి శాంత మూర్తి
త్రిబద్దో = ముడుమేకుల మీద వ్రేలాడ వేయుట
వృషబో రోరవాతి = బలి పశువు ( పస్కా పశువు)
ద్వీపాద హస్తాసో = రెండు పాదములు రెండు చేతులలోనూ మేకులు కొట్టుట.
శీర్షే సప్త = ఏడుమేకులు గల సిరాస్తానమ్ 2 తిమోతి 2 : 5,6 ).
జ్యోతిస్వరూపుడు నక్షత్రమై ఆవిర్భవించుట.
ఋగ్వేదం- శ్లోకము: “అంభస్య పారే భావనస్యమద్యే నాకస్యవృష్టే మహతొ మహీయాన్
శుక్రేణ జోతిగ్గంషి – స –అనుప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే అంతః”
భావము: ప్రజాపతి ( సృష్టికర్త ) యైన దేవుడు ( యేసుక్రీస్తు ) భూమిమీద అవతరించినపుడు మహామహిమతో ఆకాశ మందు ఒక నక్షత్రం ఆవిర్భవిస్తుంది.
📖బైబిలు: నక్షత్రం ఆవిర్భవించుటను గూర్చి ప్రవచనము చూడండి. ( సంఖ్యా 24 : 17 పెట్టారు.)
బైబిలు : మానవుల పాపములు ప్రక్షాళన చేయుట కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ( బలిపశువుగా) యజ్ఞము చేయబడినాడు. మానవుల పాపశిక్షను తానే భరించి , ఆయన శరీరము నందు పాపమునకు శిక్ష విధించెను. : ( రోమా 5 : 6-8,రోమా8 :4 , మత్తయి 27 :27-50, యోహాను 19 :16 - 30, పిలిప్పీ 2 :7 )పై ఋగ్వేదము శ్లోకము క్రీస్తు లో నెరవేరింది.
ఆర్యులర్పించిన బలులు.
ఆర్యులనువారు అర్పించిన బలులు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాయి. చదవండి.
దహనబలి : ఆది కాండము 8:20, నిర్గమా 29 : 18, లేవికాండము 1 : 4.
పాపపరిహారార్థబలి : లేవీ కాండము 5 : 7 – 9, లేవీ కాండము 6 : 8 -13. కలది కాదు. (నిజస్వరూపం క్రీస్తే). హెబ్రీ 10 : 4 ఏలాయనగా ఎడ్లయొక్కయు, మేకలయొక్కయు రక్తము వలన పాపములు తీసివేయుట ఆసాద్యము. హెబ్రీ 10 : 5-7 వరకు చదవండి అక్కడ ఈ విధంగా వ్రాయబడింది.
బలియు ఆర్పణయు నీవు కోరుటలేదు. పాపపరిహారార్థ బలులును నీకీస్టమైనవి కావు.
క్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగును. యేసురక్తం ప్రతిపాపం నుండి మనలను ప్రవిత్రులుగా చేయును. (1 యోహాను 1 : 7 -9; మత్తయి 26 : 28; 1 పేతురు 1 : 19.)
మన పురాతన ఋగ్వేదము--- యజ్ఞ పశువు అర్హతలు
ఋగ్వేదము ( బలిపశువు ) బైబిలు( యేసు క్రీస్తు) సమాదానార్థమైన బలి : నిర్గమా కాండము 20 : 24, లేవీ కాండము 23 : 19.
ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల ( యోహాను 1 : 29)
ఈయనే మన పస్కా బలి పశువు ( 1 కోరంథి 5 : 7 )
📚సామవేదము: తాండియ బ్రాహ్మణము :
శ్లోకము : “ప్రజాపతిర్థేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్”
భావము : అనగా దేవుడు తానే మన పాపముల కొరకు తన ఆత్మను యజ్ఞం లో కాల్చుకొని ప్రాయశ్చిత్తమై మనలను విమోచించును.
మానవుడు పుట్టుకతోనే పాపస్వభావం కలవాడు. పాపం చేస్తూబలహీనుడై చివరకు పాపమునకు దాసుడై పోయాడు. ఈ దుస్థితినుండి తప్పించుకొనుటకు సకలవిదాల ప్రయత్నం చేస్తూ వున్నాడు, ఐనా విముక్తి పొందలేకపోవుచున్నడు.
క్రీస్తు రక్తం ద్వారా పాప పరిహారం
రక్తప్రోక్షణం ద్వారా మానవులకు పాపవిమోచన కల్గించుటకు మన ఆత్మలను రక్షించుటకు దేవుడు ఒక మార్గమును సిద్దపర్చాడు. క్రింది శ్లోకం చదవండి.
📚సామవేదం:
శ్లోకము :
“సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం ఆవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.”
భావము: విశ్వమానవాళి పాపపరిహారం కొరకు లోకకళ్యానార్థము దేవుడు తన రక్తం చిందించుట ( బలియాగం ) ద్వారా పాపపరిహారం జరుగును.
📖బైబిలు: హెబ్రీ 10 : 1 దర్మశాస్త్రము ( వేదములు) రాబోవుచున్న మేలుల ఛాయాయెగని నిజస్వరూపం ఋగ్వేదము ( బలిపశువు ) బైబిలు( యేసు క్రీస్తు)
అది మచ్చలేనిదిగా వుండవలెను --------------------------------------------1 పేతురు 1 : 19.
ముళ్ళకిరీటం అల్లి దానినితలపై ఉంచవలెను ---------------------------------------మత్తయి 27 :29
రక్తము ప్రవహించునట్లు దాని నాలుగు పాదములయందు మేకులు కొట్టవలెను --------లూకా 24 : 39
దాని వస్త్రములు ఋత్వికులు (యాజకులు) పంచుకొనవలెను -----------------------యోహాను 19 :24;
మత్తయి 27 : 35.
దాని ఎముకలలో ఒకటైనను విరగకూడదు----- -----------------------------------యోహాను 19 :33.
చేదురసము బలి పశువుకు త్రాగిన్చవలెను --------------------------------------మత్తయి 27 : 34.
బలి ఐనా పిదప ప్రాణప్రతిష్ట జేయ వలేను ---------------------------------------మత్తయి 28 : 6 – 10.
దాని శరీర మాంసములను తినవలెను--------------------------------------------మత్తయి 26: 26
ఇవన్నియు 2000 సం,, క్రితం సర్వలోక పాపపరిహారార్థమై శిలువపైన బలిఐన ప్రజాపతి యేసుక్రీస్తును సూచిస్తున్నై
ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ------------------------------( యోహాను 1 : 29 ) 29 )
ఇవన్నియు 2000 సం ,,ల క్రితం సర్వలోక పాపపరిహారార్థమై బలియైన ప్రజాపతి యేసుక్రీస్తును సూచిస్తున్నాయి.
ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ---- యోహాను 1 : 29
బలిపశువు అయిన యేసుక్రీస్తు
మరణమును జయించుట గురించి ఋగ్వేదము తెలియచేయుట.
📚శ్లోకము : “ప్రజాపతిశ్చరతి గర్భేత్వమేవ ప్రతిజాయత్
తుచ్చ్యమ్ ప్రాణప్రజాస్తి మా బలింహరంతయః ప్రాణై ప్రతిష్టతిః”
భావము : ప్రజాప్రతి ( సృష్టికర్తయైన యేసుక్రీస్తు ) యైన దేవుడు కన్యక ( స్త్రీ) గర్భమున జన్మించి, బలిపశువు అయిన యేసుక్రీస్తు
మరణమును జయించుట గురించి ఋగ్వేదము తెలియచేయుట.
📚శ్లోకము : “ప్రజాపతిశ్చరతి గర్భేత్వమేవ ప్రతిజాయత్
తుచ్చ్యమ్ ప్రాణప్రజాస్తి మా బలింహరంతయః ప్రాణైi ప్రతిష్టతిః”
భావము : ప్రజాప్రతి ( సృష్టికర్తయైన యేసుక్రీస్తు ) యైన దేవుడు కన్యక ( స్త్రీ) గర్భమున జన్మించి,
ప్రాణప్రతిష్ట చేయబడిన వాడై మరణం నుండి తిరిగిలేచి పునరుత్తానుడవుతాడు.
📖బైబిలు: యేసుక్రీస్తు తాను చెప్పిన ప్రకారమే చనిపోయి మూడవదినమున ( సమాధి ) మరణంను గెలిచి లేచేను. ప్రభువు చెప్పిన మాటవినండి. “పునరుత్తానమును జీవమును నేనే” యోహాను 11: 25.
ఆయన పునరుత్తానం బైబిలు గ్రంథమందు మత్తయి 18 వ అధ్యాయము, మార్కు 16 వ అధ్యాయము చదవండి మరియు అపోస్తుల కార్యములు 26 : 22; 1 కోరింథి 15 : 1 – 15 ధ్యానించండి.
మరణం ఆయనను బంధించుట అసాధ్యము. అపోస్తుల కార్యములు 2 : 24.
యేసుక్రీస్తు పుట్టుక, జీవితం ఒక మర్మం కాదు. ఇది చరిత్రతో చాలా సంబంధం కలిగియున్నది. ఆయన మధ్య తూర్పు ఆసియాలో ఒక యూదా కుటుంభములో జన్మించెను. అకస్మాత్తుగా కాదు. ఆయన శరీరధారిగా రాకముందే బైబిలునందు పాతనిభంధనలో ఈ సత్యం వివరించబడింది. ఇవన్నీయూ క్రీస్తుపుట్టుకకు ముందు ఎన్నోవందల సంవత్సరముల క్రితం వ్రాయబడినవి.
మొదట మధ్య ఆసియా నుండి ఉత్తర ఇండియాకు వలస వచ్చిన ప్రాచీన ఆర్యులు వ్రాసిన వేదములు రానున్న లోకరక్షకుని గురించియే వివరించుచున్నవి. ( వేదముల సారమంతయు యేసుక్రీస్తునందు నెరవేరునట్లు ) బైబిలు గ్రంధములో వివరించబడెను.
యేసుక్రీస్తు ఇలా సెలవిచ్చారు:
లేఖనములయందు ( వేదములు) మీకు నిత్యజీవమున్నదని తలంచి వాటిని పరిశోదించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్మిచ్చుచున్నవి. ( యోహాను 5 : 39)
నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను. ( యోహాను 14 : 6 )
రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. ( లెవీ కాండము 17 : 17 ) కనుక బలియందు రక్తము తప్పనిసరి. యేసుక్రీస్తు రక్తము ప్రతిపాపమునుండి పవిత్రులనుగా చేయును. ( 1 యోహాను 1 :7 )
మనము పాపము విషయమై చనిపోయి నీతివిషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను ( శిలువ) మీద మోసుకొనెను. ( 1 పేతురు 2 : 24 ). మరియెవని వలనను రక్షణ కలుగదు.
ఈ నామముననే మనము రక్షణ పొందవలయును. ( అపోస్తుల కార్యములు 4 : 12 ).
మానవుడు తన జన్మ కర్మ పాపములను బట్టి నిత్యాగ్ని దండనకు పాత్రుడని తన పాపపరిహారమునకు మార్గం యేసుక్రీస్తేనని, ఆయన ఒక్కడే పాపపరిహార క్రయము చెల్లించిన “ ప్రజాపతి” యని పరిశుద్ద బైబిలు గ్రంధము తేటతెల్లముగా వివరించుచున్నది. కనుక నీ పాపము విషయమై పశ్చ్చాత్తాపపడి క్రీస్తులో నీకున్న పరిహారమును అంగీకరించి నిత్యరక్షణ పొందుమని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుచున్నాము.
దేవుడు ఒక్కడే.
📚ఋగ్వేదము: 10 : 129 : 2.
శ్లోకము: “ న మృత్యురా సీదమృతం నతర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత:
ఆనీరవాతమ్ స్వదయా తదేకం తస్మద్ధాన్యన్న పర: కిం చావాన”
భావము: ఒకప్పుడు జీవమరణములు లేవు.పగలు, రాత్రులు లేవు. స్వయంభవుడైన దేవుడు ఈ సృష్టి కలుగ జేయక మునుపు ఆయన తప్ప మరేదియు లేదు.
📖బైబిలు: ఇదిగో నేను నేనే దేవుడను. నేను తప్ప వేరొక దేవుడులేడు. మృతినొందించువాడనూ, బ్రతికించు వాడానూ నేనే. గాయపరచు వాడానూ, గాయము కట్టు వాడానూ నేనే. నాచేతిలోనుండి విడిపించువాడేవాడునూ లేడు. ( ద్వితీయోపదేశ కాండము 32 :39; యేషయా 43 : 10 -12 వరకు చదవండి.మరియు 1 తిమోతి 6 : 15, 16 ) అందరికీ దేవుడు ఒక్కడే ( 1 1 కోరింథి 8 : 4 – 6 )
దేవుడు – దేవతలు
📚ఋగ్వేదము – 7 : 104 : 14
శ్లోకము: యది వాహమనృత దేవ ఆసమోఘం వా దేవాం అప్యూహే అగ్నే!
కిమస్మభ్యం జాతవేదో హ్రుణీషే ధ్రోషు వాచస్తే నిర్రుధం సఛంథామ్ !!
---------------------------------------------------------
1, మే 2017, సోమవారం
వేదము లో క్రీస్తు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి