✳కయ్యినుకు భార్య ఎక్కడ నుండి వచ్చినది....??????
👉1) అటు bible నమ్మిన వారిని,ఇటు bible నమ్మని వారిని వేదిస్తున్న ప్రశ్నలలో ఒకటే ఈ కయ్యినుకు భార్య ఎక్కడి నుండి వచ్చినది??భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మనుష్యులందరికీ ఆదామే తండ్రని bible భోదిస్తుంది. ఆదాము హవ్వల ప్రధమ గర్భ ఫలమైన కయ్యినుఅతని తమ్ముడైన హేబెలును చంపి దేవుని సన్నిధి నుండి భయలదేరి ఎదేనుకు తూర్పు దిక్కుననున్న నోదు దేశములో కాపురమున్నప్పుడు అతడు తన భార్యను కూడగా అతనికి కుమారుడు పుట్టేనని bible నందు వ్రాయబడింది. కయ్యిను భార్య ఎక్కడ నుండి,ఎవరి వలన వచ్చినదనియు, ఏదేను తోటకు తూర్పు దిక్కున నొదు అను దేశము ఎట్లు పుట్టెనను సందేహము bible చదువువారికి కలుగును.
👉2)ఆదాము వలన సంతతి కాకుండా మిగిలిన మరెవరి వలనైన సంతతులు భూమి మీద ఉన్నవా?? ఒక వేళ అట్టిసంతతులు భూమి మీద ఉన్నట్లు అయితే ఆదాము మొదటి మానవుడు కాడనియు ,భూమి మీద పుట్టుకొస్తున్న వారంతా ఆదాము సంతతి అనుకొనుటకు అధరాలు లేవని తలంచవచ్చు. ఆదాము నుండి నోవాహు కాలము వరకు సుమారు 1000 years ఆయుష్షు కాలము దేవుడు నరులకు ఇచ్చెనని ఆదికాండము 5వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. ఇక ఆదాము 130వ ఏట షేతును కనగా షేతు 105 ఎండ్లకే కుమారుని కనెను. ఎనోషు 90 yearsకే కుమారుని కనగా కేయునాను 70 ఏళ్లకే కుమారుని కనెను. అనగా మొదటి 100 years లోనే వీరంతా సుమారుగా కుమారులను,కుమార్తెలను కనినట్లుగా ఆ అధ్యాయంలో కనిపించుచున్నది.
👉3) ఇక ఉదాహరణలోకి వెళ్తే ప్రస్తుతము మానవ ఆయుష్షు కాలం సుమారు 70 ఏళ్లనీ చెప్పుకొనవచ్చు. ఈ కాలమును బట్టి nithin తన 20 ఏటనే పెళ్లి చేసుకుంటే తండ్రి కావచ్చు. Nithinకి 40 ఏండ్లు వచ్చునప్పటికిnithinకుమారుడు కూడతండ్రి కావచ్చు. మరలాnithinకి 60 ఏండ్లు వచ్చినప్పుడుమనముడు తండ్రి కావచ్చు.అధిక బలముండి nithin80 ఏండ్లుఒక వేళ బ్రతికితే nithin ముని ముని మనముడు కూడా తండ్రి కావచ్చు. ఉదాహరణను పరిశిలిస్తే nithin 80 ఎటకే 3 తరములను చూడగలుగుచున్నాడు. ఈ 3 తరాలలో వారి వారి గర్బముల నుండి పుట్టిన వారు ఎంత మంది కాగలరో మీరు ఊహించవచ్చు.కేవలం 80 years బ్రతికిన వారికే ఇన్ని తరాలు ఉన్నప్పుడు మరి ప్రారంభ కాలములో మనుష్యులు సుమారు 1000 years బ్రతికినప్పుడు ఆ వెయ్యి ఎండల్లో ఎన్ని లక్షల మందిని వారు కనియుండగలరో సులువుగా లెక్కలు కట్టవచ్చు.
👉4) కయ్యిను ఆదామును విడిచిపోయిన తరువాత అది దంపతులైన ఆదాము హవ్వులకు తిరిగి కుమారులు ,కుమార్తెలు పుట్టినట్లుగా bible నందు వ్రాయబడింది( ఆదికాండము 5:1-5& 4:24). ఆ సంతతిలోని వారే నొదు దేశంలో కయ్యిను చోటికి చేరి వారిలో ఒక స్త్రీని కయ్యినుకు భార్యగా చేయబడింది. ఆదాము సంతతి నుండి వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ కయ్యినుకు భార్యగా చేయబడినదని నిస్సందేహముగా చెప్పవచ్చు.
👉5) అయితే ఇక్కడ మరో సందేహమురావొచ్చు. నొదు దేశం ఎట్లు వచ్చినది? ఆదికాండము నుండి ద్వితియోపదేశ కాండము వరకు మొదటి 5 కాండలు వ్రాసిన వ్యక్తి మోషే అని (ద్వితి 31:9,24, సంఖ్య33:2, నిర్గమ 24:4,లూకా 24:44,లూకా 16:31& యోహాను 5:46) ఈ వచనాలు ద్వార తెలుసుకోవచ్చు. దీనిని బట్టి ఆదికాండము అయిపోయిన తరువాతే నిర్గమ కాండంలో పుట్టిన మోషే తాను పుట్టుక,నోవాహు జలప్రళయం, బాబెలు గోపురం,అబ్రహం,ఇస్సాకు ,యాకోబు,ఇశ్రాయేలియుల సంతానమును గూర్చి కొంత వరకు ఆదికాండమును వ్రాసినప్పటికే ఏదేను తోట తూర్పు దిక్కున నొదు దేశము విలసిల్లెను గనుక దాని పేరు ఆదికాండములో వ్రాసెను.
👉6) అనగా కయ్యిను అక్కడికి వెళ్ళినప్పటికీ అది నిర్జన ప్రదేశమే గానీ మరొకటి కాదు. మోషే వ్రాసేటప్పుడు అది నొదు దేశంగా పిలువబడుచున్నది గనుక అప్పుడు తాను వ్రాస్తున్న ఆదికాండములో దానిని నొదు దేశంగా వివరించెను. 50 years క్రితం నిర్మానుష్యంగా ఉన్న ఎన్నో ప్రాంతాలు తరువాత ప్రజలు ఆక్రమించుకొని పల్లెలుగా,పట్టణాలుగా మారుచున్నవి.50 ఏళ్ల క్రితం దానికి ఏ పేరు లేకపోయినప్పటికీ అది ఒక పట్టణంగా మారినప్పుడు దానికంటూ ఒక పేరు పెట్టు పిలుచుట జరుగును. నొదు దేశం పుట్టుక కూడా అట్టిదే. కయ్యిను వెళ్ళినప్పటికీ అది నిర్మానుష్యమైనను మోషే వ్రాసినప్పటికి అది నొదు దేశంగా పిలవబడుచుండెను.....✍
----------------------------------------------------------
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి